దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోట..! ఎక్కడం చాలా కష్టం.. తిరిగి చీకటి పడకముందే దిగాలి.. లేదంటే..

|

Jul 10, 2023 | 3:35 PM

పశ్చిమ కనుమలలోని అద్భుతమైన ఈ కోట.. సముద్ర మట్టానికి దాదాపు 700 మీటర్ల ఎత్తులో ఉంది. 2300 అడుగుల ఎత్తైన కొండపై నిర్మించబడిన ఈ కోటకు చాలా తక్కువ మంది మాత్రమే వెళతారు. సూర్యాస్తమయానికి ముందే దిగి వచ్చేస్తారు. ఎందుకంటే..

దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోట..! ఎక్కడం చాలా కష్టం.. తిరిగి చీకటి పడకముందే దిగాలి.. లేదంటే..
Dangerous Fort In India
Follow us on

దేశంలోని అనేక చారిత్రక ప్రదేశాలు, కోటల గురించి మీరు చాలానే విని ఉంటారు. లేదంటే చదివి ఉంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి ప్రదేశాలను సందర్శించడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ కోట భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోటగా ప్రసిద్ధి చెందింది. ఈ కోట ఎక్కడం సాహసోపేతమైన పని. ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడాల్సి ఉంటుంది. ఈ కోట దేశంలోని అత్యంత ప్రమాదకరమైన కోటలలో ఒకటి. మహారాష్ట్రలో ఉన్న కలవంతి కోట సుమారు 2,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కోట ఎక్కడానికి సన్నని మెట్లు ఉంటాయి. వాటికి రెండు వైపులా కందకాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా కాలు జారితే, వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. కానీ, ఇప్పటికీ ప్రజలు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడతారు.

ఈ కోటను బహమనీ సుల్తానేట్ పన్వేల్, కళ్యాణ్ కోటపై నిఘా ఉంచడానికి నిర్మించారు. అయితే 1458 ADలో అహ్మద్‌నగర్ సుల్తానేట్ ఓడిపోయి ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. పూర్వం దీనిని మురంజన్ కోట అని పిలిచేవారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ హయాంలో దీనిని రాణి కలవంతి కోటగా మార్చారు. ఇటువంటి అనేక ప్రమాదకరమైన, దుర్గమమైన కోటలు మహారాష్ట్రలో చాలా ఉన్నాయి. అయితే ఈ కోటకు ఉన్న ఆదరణ మరొకటి ఉంది. ఇక్కడ మెట్లకు రెయిలింగ్, గానీ, తాడుగానీ ఉండదు. ప్రజలు ఈ మెట్లను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది మరణానికి దారి తీస్తుంది. ఈ కోట మాథెరన్, పన్వెల్ మధ్య నిర్మించబడింది. దీని నిర్మాణం, ఎత్తు ప్రజలను మరింత ఆకర్షిస్తాయి. ఈ కోట చుట్టూ మరిన్ని అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు పగలు సూర్యాస్తమయానికి ముందే ఈ కోట నుండి తిరిగి వచ్చేస్తుంటారు. ఎందుకంటే సాయంత్రం పూట ఇక్కడి నుంచి తిరిగి వెళ్లడం అసాధ్యం. సూర్యాస్తమయానికి ముందు పగటిపూట మాత్రమే ఈ ట్రెక్‌ను దాటగలరు. ఇక్కడ నీరు ఉండదు. కరెంటు కూడా లేదు. ఎత్తులో ఉండటం వల్ల సాయంత్రం కాగానే ఇక్కడ తీవ్రమైన చలి మొదలవుతుంది. ఈ కారణంగా పర్యాటకులు సాయంత్రానికి ముందే కోట నుండి దిగడం ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రబల్‌గడ్, కలవంతిన్ దుర్గాకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కోట మొదటి పేరు మురంజన్ గడ్ అని ఆ సమయంలో యాదవులు కోటకు పెట్టారు. ప్రబల్‌గడ్ వాణిజ్య మార్గంలో, సముద్ర మార్గానికి సమీపంలో ఉన్నందున, యాదవుల కాలంలో ఇక్కడ సైనిక స్థావరం స్థాపించబడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ కోటకు కలవంతిన్ దుర్గ్ అని పేరు పెట్టారు. ప్రబల్‌గడ్‌ను గతంలో సెంటినెల్ దుర్గ్ అని పిలిచేవారు.

ప్రబల్గడ్ కోట మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉంది. పశ్చిమ కనుమలలోని అద్భుతమైన ఈ కోట.. సముద్ర మట్టానికి దాదాపు 700 మీటర్ల ఎత్తులో ఉంది. 2300 అడుగుల ఎత్తైన కొండపై నిర్మించబడిన ఈ కోటకు చాలా తక్కువ మంది మాత్రమే వెళతారు. సూర్యాస్తమయానికి ముందే దిగి వచ్చేస్తారు. ఇది ఏటవాలుగా ఉన్నందున ఇక్కడ ఎక్కువసేపు ఉండలేరు. కోటలో విద్యుత్, నీటి వ్యవస్థ కూడా లేదు. సాయంత్రం అవుతుండగా, ఇక్కడ నుండి వచ్చే వింత నిశ్శబ్దం మైళ్ళ వరకు వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఈ కోట అందం మరింత పెరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..