AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mizoram Election: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు.

Mizoram Election: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?
Mizoram Cm Zoramthanga
Balaraju Goud
|

Updated on: Nov 07, 2023 | 9:19 AM

Share

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు. మిజోరాంలో 40 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు, గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.

ఓటు వేసే సమయంలో ఈవీఎం యంత్రం పనిచేయలేదన్నారు సీఎం జోరంతంగా. ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి ప్రయత్నించారు. కానీ యంత్రం మొరాయించింది. తిరిగి వచ్చి ఓటు వేస్తానని వెళ్ళిపోయారు సీఎం జోరంతంగా. మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అయ్యే అవకాశముందని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. దానిపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.

174 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించడానికి మిజోరంలో దాదాపు 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో దాదాపు 4.39 లక్షల మంది మహిళల ఓటర్లు ఉన్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రధాన ప్రతిపక్షం జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రతిపాదించింది. వీరితో పాటు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

మిజోరం అంతటా ఉన్న 1,276 పోలింగ్ స్టేషన్‌లలో 149 రిమోట్ ఓటింగ్ కేంద్రాలు, అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న 30 కీలకమైనవిగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,200 మంది సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌కు ముందు మయన్మార్‌తో 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు, బంగ్లాదేశ్‌తో 318 కిలోమీటర్ల సరిహద్దును మూసివేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి