AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mizoram Election: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు.

Mizoram Election: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?
Mizoram Cm Zoramthanga
Balaraju Goud
|

Updated on: Nov 07, 2023 | 9:19 AM

Share

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు. మిజోరాంలో 40 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు, గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.

ఓటు వేసే సమయంలో ఈవీఎం యంత్రం పనిచేయలేదన్నారు సీఎం జోరంతంగా. ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి ప్రయత్నించారు. కానీ యంత్రం మొరాయించింది. తిరిగి వచ్చి ఓటు వేస్తానని వెళ్ళిపోయారు సీఎం జోరంతంగా. మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అయ్యే అవకాశముందని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. దానిపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.

174 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించడానికి మిజోరంలో దాదాపు 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో దాదాపు 4.39 లక్షల మంది మహిళల ఓటర్లు ఉన్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రధాన ప్రతిపక్షం జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రతిపాదించింది. వీరితో పాటు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

మిజోరం అంతటా ఉన్న 1,276 పోలింగ్ స్టేషన్‌లలో 149 రిమోట్ ఓటింగ్ కేంద్రాలు, అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న 30 కీలకమైనవిగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,200 మంది సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌కు ముందు మయన్మార్‌తో 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు, బంగ్లాదేశ్‌తో 318 కిలోమీటర్ల సరిహద్దును మూసివేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC