బ్రేకింగ్‌.. నాసిక్‌లో భూప్రకంపనలు

| Edited By:

Aug 18, 2020 | 6:38 PM

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్‌గా..

బ్రేకింగ్‌.. నాసిక్‌లో భూప్రకంపనలు
Follow us on

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. నాసిక్‌కు పడమరన 88 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

ఇదిలావుంటే.. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారీ వర్షాలు కూడా ముంబైలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. గతంలో కూడా పాల్‌ఘర్‌ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ఎలాంటి నష్టం జరగలేదు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు