బ్రెజిల్లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 23 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు కరోనా బారినపడి 600 మంది మరణించారు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన 19,373 కరోనా పాజిటివ్ కేసులతో.. ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా నమోదైన కరోనా […]
బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 23 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు కరోనా బారినపడి 600 మంది మరణించారు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన 19,373 కరోనా పాజిటివ్ కేసులతో.. ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,59,570కి చేరింది. ఇక ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,08,536 మంది మరణించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రెండో దేశంగా బ్రెజిల్ ఉంది. అగ్రస్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉండగా.. మూడో స్థానంలో భారత్ ఉంది.