కమల్‌నాథ్ సర్కార్‌లో టెన్షన్.. 17 మంది ఎమ్మెల్యేలు జంప్.. సైలంట్‌గా ఉన్న సింధియా..!!

మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. స్వల్ప మెజార్టీతో అధికారం చేపట్టిన కమల్‌నాథ్ సర్కార్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేత విలన్‌లా అయ్యారు. ఆయన మరెవరో కాదు.. పార్టీ సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అతిదగ్గరగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా. గతంలోనే ముఖ్యమంత్రి పదవిని ఆక్షాంక్షించిన సింధియా.. గతంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు ఇండికేషన్స్ ఇచ్చారు. అదంతా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావమనే చర్చ అప్పటినుంచే కొనసాగుతోంది. అప్పటినుంచి మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకో మలుపులు […]

కమల్‌నాథ్ సర్కార్‌లో టెన్షన్.. 17 మంది ఎమ్మెల్యేలు జంప్.. సైలంట్‌గా ఉన్న సింధియా..!!
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 7:46 PM

మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. స్వల్ప మెజార్టీతో అధికారం చేపట్టిన కమల్‌నాథ్ సర్కార్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేత విలన్‌లా అయ్యారు. ఆయన మరెవరో కాదు.. పార్టీ సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అతిదగ్గరగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా. గతంలోనే ముఖ్యమంత్రి పదవిని ఆక్షాంక్షించిన సింధియా.. గతంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు ఇండికేషన్స్ ఇచ్చారు. అదంతా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావమనే చర్చ అప్పటినుంచే కొనసాగుతోంది. అప్పటినుంచి మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకో మలుపులు తిరుగుతున్నాయి.

తాజాగా.. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భోపాల్ నుంచి మూడు ప్రత్యేక విమానాల్లో వీరిని తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా రెబెల్స్‌గా మారి.. కమల్‌నాథ్ సర్కార్‌ను కుప్పకూల్చే విధంగా ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెబల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ మొత్తం వ్యవహారానికి సింధియానే కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంత గందరగోళం జరుగుతున్నా.. సింధియా మాత్రం ఢిల్లీలోనే ఉన్నారు. అయితే బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేల్లో మెజార్టీ సింధియా వర్గం వారే ఉన్నారట. దీంతో ఈ సంకాటలన్నింటికి సింధియానే కారణమంటూ కమల్ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్న ప్రతిపక్ష బీజేపీ.. సమయం చూసి.. వెంటనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కమలం పార్టీ కూడా పక్కా వ్యూహాలు రచిస్తోంది.