ఫ్యాన్ రిపేర్ వచ్చిందని ఎలక్ట్రీషియన్ వద్దకు.. అతను విప్పి చూడగా షాక్..

మదరసాకు విరాళంగా వచ్చిన ఫ్యాన్‌ను రిపేర్ కోసం తీసుకెళ్లగా, దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఉండటం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌లో జరిగిన ఈ ఘటనతో మౌల్వీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్యాన్ అందిందని, విచారణ జరుగుతోందని మదరసా ప్రతినిధులు తెలిపారు.

ఫ్యాన్ రిపేర్ వచ్చిందని ఎలక్ట్రీషియన్ వద్దకు.. అతను విప్పి చూడగా షాక్..
Made In Pakistan Fan

Updated on: May 16, 2026 | 10:51 AM

ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌లో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భావించే ఓ ఫ్యాన్ కారణంగా మదరసాకు చెందిన మౌల్వీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. కుశినగర్‌లోని హకీకతుం ఉలూం మదరసాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ చెడిపోవటంతో దానిని రిపేర్ చేయించడానికి ఓ ఎలక్ట్రీషియన్ వద్దకు తీసుకెళ్లారు. ఫ్యాన్‌ను విప్పి పరిశీలించిన ఎలక్ట్రీషియన్ దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కంగారుపడిన మదరసా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఫ్యాన్ తమకు రెండేళ్ల కిందట విరాళంగా అందిందని, రాజ్ మిస్త్రీ కంపెనీలో పనిచేసే షంషుద్దీన్ దీన్ని బహుమతిగా ఇచ్చారని మౌల్వీ వివరించారు. సౌదీలో ఉండే షంషుద్దీన్ కుమారుడు దీన్ని కార్గో ద్వారా పంపించారని వెల్లడించారు. మేడ్ ఇన్ పాకిస్తాన్ మార్కుతో ఉన్న వస్తువు తమ వద్ద ఉండటం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయోనని ఆందోళన చెందామని మదరసా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. పూర్తి సాక్ష్యాధారాలు లభ్యం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Loading...
Unable to load recommendations.
Follow Us