AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు అందుకే: విదేశాంగ శాఖ క్లారిటీ

కొత్త పాస్‌పోర్టులపై బీజేపీ గుర్తు(కమలం) ముద్రిస్తున్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో వీటిపై విదేశాంగ శాఖ స్పందించింది. జాతీయ చిహ్నాల్లో ఒకటైన కమలం గుర్తును కొత్త పాస్‌పోర్టులపై ముద్రించామని విదేశాంగ తెలిపింది. లోక్‌సభ ఈ విషయంపై రచ్చ జరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఎట్టకేలకు వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఫేక్ పాస్‌పోర్టుల సమస్యను అధిగమించడం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కమలం గుర్తును […]

పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు అందుకే: విదేశాంగ శాఖ క్లారిటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 13, 2019 | 9:08 AM

Share

కొత్త పాస్‌పోర్టులపై బీజేపీ గుర్తు(కమలం) ముద్రిస్తున్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో వీటిపై విదేశాంగ శాఖ స్పందించింది. జాతీయ చిహ్నాల్లో ఒకటైన కమలం గుర్తును కొత్త పాస్‌పోర్టులపై ముద్రించామని విదేశాంగ తెలిపింది. లోక్‌సభ ఈ విషయంపై రచ్చ జరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఎట్టకేలకు వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఫేక్ పాస్‌పోర్టుల సమస్యను అధిగమించడం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కమలం గుర్తును ముద్రించామని.. రొటేషన్ పద్ధతిలో మిగిలిన జాతీయ చిహ్నాలను కూడా ముద్రిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించిన విషయమై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలోని కోళికోడ్‌లో ఈ పాస్‌పోర్టులను చేస్తున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్.. కమలం అన్నది జాతీయ చిహ్నాల్లో ఒకటని.. అదనపు భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాతీయ చిహ్నాన్ని ముద్రించామని అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే నెలలో మరో జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తామని రవీష్ కుమార్ స్పష్టం చేశారు.