‘మరీ అంత నిజాయితీ పనికిరాదు.. నిటారుగా ఉన్న చెట్లనే మొదట నరికేది’ ఎన్నికల పలితాలపై నటుడి ఆసక్తికర పోస్టు

|

Jun 05, 2024 | 4:09 PM

తాజాగా జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు గెలిపు సొంతం చేసుకున్నప్పటికీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు, ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించిందనేది కాదనలేని సత్యం. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఘోర పరాజయం పాలైంది..

మరీ అంత నిజాయితీ పనికిరాదు.. నిటారుగా ఉన్న చెట్లనే మొదట నరికేది ఎన్నికల పలితాలపై నటుడి ఆసక్తికర పోస్టు
Anupam Kher And Modi
Follow us on

తాజాగా జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు గెలిపు సొంతం చేసుకున్నప్పటికీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు, ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించిందనేది కాదనలేని సత్యం. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నెట్టింట పెట్టిన పోస్టు ఒకటి ఆసక్తికరంగా మారింది. అందులో ఏముందంటే..

నిజాయితీ పరుడైన వ్యక్తిసార్లు కొన్నిసార్లు మరీ ఎక్కువగా నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు. నిజాయితీ గల వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిజాయితీని వదులుకోడు. అందుకే కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాడు’ అని తన పోస్టులో ఎవరి పేరు ప్రస్తావించకుండా ఓట్ల ఫలితాలపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇక అనుపమ్‌ఖేర్‌ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఫలితాలపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెల్పుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నటి కంగనాకు అనుపమ్‌ ఖేర్‌ అభినందనలు తెలిపారు. ఆమె కొత్త జర్నీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల కంగనాతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. తన పోస్టులో కంగనాను రాక్‌స్టార్‌గా అభివర్ణించారు.ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే ఏదైనా జరగవచ్చనే విషయం కంగనా నిరూపించిందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.