AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా తగ్గిన ఉల్లి ధర.. రోడ్డుపై పారబోసి భోరుమన్న రైతు..!

ఇన్నాళ్లు వినియోగదారులకు కంటతడి పెట్టించిన ఉల్లి, ఇప్పుడు పంట పండించిన రైతులను కన్నీరు పెట్టిస్తోంది. పంట చేతికొచ్చే దశలో మార్కెట్​లో ఒక్కసారిగా ఉల్లి ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటకు కనీస ధర లభించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

భారీగా తగ్గిన ఉల్లి ధర.. రోడ్డుపై పారబోసి భోరుమన్న రైతు..!
Onion Farmer
Balaraju Goud
|

Updated on: Jun 04, 2025 | 5:59 PM

Share

ఇన్నాళ్లు వినియోగదారులకు కంటతడి పెట్టించిన ఉల్లి, ఇప్పుడు పంట పండించిన రైతులను కన్నీరు పెట్టిస్తోంది. పంట చేతికొచ్చే దశలో మార్కెట్​లో ఒక్కసారిగా ఉల్లి ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటకు కనీస ధర లభించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక రైతు ఉల్లిపాయలకు మార్కెట్లో సరైన ధర రాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. తీవ్ర మనోవేదనతో ఉల్లిపాయలను రోడ్డుపై పడేసి అక్కడే పడుకుని నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైతు నిజమైన మూలధనం అతని వ్యవసాయమే. భారతదేశంలో చాలా మంది రైతులు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఇలాంటి బాధాకరమైన దృశ్యం కనిపించింది. అక్కడ ఉల్లిపాయల ధరలు భారీగా తగ్గడంతో గాయపడిన ఒక రైతు రోడ్డుపై పారబోసి భోరుమన్నాడు. మంచి నాణ్యత గల ఉల్లి పంటతో రైతులు బసవనబాగేవాడి మార్కెట్‌కు వచ్చారు. క్వింటాలుకు కనీసం రూ. 800 నుండి రూ.1000 వరకు లభిస్తుందని ఆశించారు. కానీ వేలం ప్రారంభమైనప్పుడు, బిడ్ క్వింటాలుకు రూ. 200 దాటలేదు. ఇంత తక్కువ ధరకు ఉల్లిపాయలు అమ్ముకోలేక రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు.

అదే మార్కెట్‌కు రోనిహాల్ గ్రామానికి చెందిన ఒక రైతు ఉల్లిపాయలతో వచ్చాడు. కనీస మద్దతు ధర లభించకపోవడంతో నిరసనగా, ఉల్లిపాయలతో నిండిన బస్తాను రోడ్డుపై పారబోసి, కోపంతో ఉల్లిపాయలపై పడుకుని నిరసన తెలిపాడు. అతని నిరసన కేవలం ఆగ్రహాన్ని వ్యక్తపరచడమే కాదు, నిస్సహాయతకు చిత్రం. తన పంటకు ధర లభించనప్పుడు రైతు హృదయం ఎంతగా విరిగిపోతుందో ఆయన చూపించారు.

వీడియో చూడండి.. 

View this post on Instagram

A post shared by UPSC Alerts (@upscalerts)

రైతుల నిస్సహాయత బయటపడటం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం, మహారాష్ట్ర నుండి ఒక వీడియో వైరల్ అయింది, దీనిలో ఒక రైతు మార్కెట్లో వేరుశనగ అమ్మడానికి వచ్చాడు. కానీ అకస్మాత్తుగా కురిసిన వర్షంలో, అతని కళ్ళ ముందే అతని పంట మొత్తం కొట్టుకుపోయింది. అతను ఏడుస్తూ దానిని సేకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ దాన్ని ఏమాత్రం కాపాడలేకపోయాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..