Marriage Problems: ‘వయసు దాటిపోతోంది.. పెళ్లి కూతుళ్లు దొరకట్లేదు సారూ’.. మాజీ ముఖ్యమంత్రికి యువకుడి లేఖ..

|

Nov 22, 2022 | 8:00 AM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వద్దకు తమ సమస్యలు చెప్పుకునేందుకు నిత్యం వందలాది మంది జనాలు ఫిర్యాదులతో వస్తుంటారు.

Marriage Problems: ‘వయసు దాటిపోతోంది.. పెళ్లి కూతుళ్లు దొరకట్లేదు సారూ’.. మాజీ ముఖ్యమంత్రికి యువకుడి లేఖ..
Marriage
Follow us on

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వద్దకు తమ సమస్యలు చెప్పుకునేందుకు నిత్యం వందలాది మంది జనాలు ఫిర్యాదులతో వస్తుంటారు. ఉండేందుకు ఇల్లు ఇప్పించండి, ఉద్యోగం ఇప్పించండి, చికిత్సకు సాయం చేయండి ఇలా రకరకాల కష్టాలు చెప్పుకుంటూ వస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం వింత కష్టంతో వచ్చాడు. కుమారస్వామికి తన కష్టాన్ని విన్నవించుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడికి వచ్చిన కష్టమేంటి? అంతలా అందరూ షాకయ్యే సీన్ ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తాను పెళ్లి చేసుకోవడానికి వధువు దొరకడం లేదంటూ వాపోయాడు యువకుడు. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు.

అవును, కోలారు జిల్లా పంచరత్న యాత్రలో కుమారస్వామి.. గ్రామస్తులు, రైతుల కష్టాలు వింటూ ఉన్నారు. ఇంతలో ముదువతి గ్రామానికి చెందిన ధనంజయ అనే యువకుడు కుమార స్వామికి ఓ వినతిపత్రం ఇచ్చాడు. పెళ్లి చేసుకోవడానికి వధువులు దొరకడం లేదంటూ ప్రస్తావించాడు. ‘ఒక్కలిగ’ రైతు యువకులకు పెళ్లి వయసు దాటినా వధువులు రావడం లేదని, ఒక్కలిగ యువకులకు వధువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కుమారస్వామిని లేఖ ద్వారా అభ్యర్థించాడు.

‘కోలార్‌లో రైతు యువకులు వధువుల కొరతను ఎదుర్కొంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకు చెందిన వధువులను ఇతర జిల్లాలకు చెందిన వరులను పెళ్లి చేసుకోకూడదనే నిబంధనను అమలు చేయాలి. నువ్వు మాకు వధువులను వెతకాలి’ అని ధనంజయుడు కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కుమారస్వామి సీఎం కావడం ఖాయమని, జేడీఎస్ ప్రభుత్వంలో ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ధనంజయ కోరాడు. పెళ్లి వయసు దాటినా వధువు లభించకపోవడం సంక్లిష్టమైన, విచిత్రమైనప్పటికీ.. ధనంజయ విజ్ఞప్తి సామాజిక సమస్యపై వెలుగునిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ..

ఇటీవల నాగమంలలోని ఆదిచూచనగిరి మఠం ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి ఒక్కలిగ వధూవరుల సమ్మేళనంలో 25 వేల మందికి పైగా పాల్గొనగా.. వేలాది మంది ఒక్కలిగ కుర్రాళ్లు వధువు కోసం తరలిరావడం చర్చనీయాంశమైంది. అదొక జాతరలా సాగింది. కేవలం 200 మంది అమ్మాయిలు మాత్రమే పాల్గొనగా, 11,750 మంది అబ్బాయిలు పాల్గొన్నారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..