Kangana Ranaut: నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్.. పాలిటిక్స్‌లోనూ సక్సస్‌పై ధీమా

|

May 14, 2024 | 3:53 PM

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని మండి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా కంగనా రనౌత్‌ మంగళవారంనాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హిమాచల్‌ మాజీ సీఎం జైరాం ఠాకూర్‌, బీజేపీ అగ్రనేతలతో పాటు కంగనా రనౌత్ తల్లి ఆషా రనౌత్, సోదరి రంగోలి చందెల్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే మండి నియోజకవర్గంలో కంగనా సుడిగాలి ప్రచారం చేశారు.

Kangana Ranaut: నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్.. పాలిటిక్స్‌లోనూ సక్సస్‌పై ధీమా
Kangana Ranaut
Follow us on

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని మండి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా కంగనా రనౌత్‌ మంగళవారంనాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హిమాచల్‌ మాజీ సీఎం జైరాం ఠాకూర్‌, బీజేపీ అగ్రనేతలతో పాటు కంగనా రనౌత్ తల్లి ఆషా రనౌత్, సోదరి రంగోలి చందెల్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే మండి నియోజకవర్గంలో కంగనా సుడిగాలి ప్రచారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో పోటీకి దిగడానికి మండి ప్రజల ఆదరాభిమానాలే కారణమన్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌గా సక్సెస్‌ సాధించినట్టే రాజకీయాల్లో కూడా సక్సెస్‌ సాధిస్తానని అన్నారు కంగనా. కాంగ్రెస్‌ అభ్యర్దిగా మండిలో విక్రమాదిత్యసింగ్‌ పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలు సమయంలో కంగనా ఆకుపచ్చ రంగ చీర, హిమాచలి క్యాప్‌ను ధరించి ఉన్నారు.

సినిమాల పరంగా ఆమె నటించిన ఎమర్జెన్సీ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వంవహిస్తుండటం విశేషం. ధివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 14న ఈ మూవీని విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు.