AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మాయిని బూటు కాళ్లతో తంతూ యువకుడి అరాచకం.. స్కూల్ నుంచి వస్తుండగా.. వీడియో

ఓ విద్యార్థినిని యువకుడు దారుణంగా కొడుతూ హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి సీఎం దగ్గరకు చేరింది.

Watch Video: అమ్మాయిని బూటు కాళ్లతో తంతూ యువకుడి అరాచకం.. స్కూల్ నుంచి వస్తుండగా.. వీడియో
Jharkhand Shocker
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2022 | 1:47 PM

Share

Jharkhand Shocker: దేశంలో మహిళలు, యువతులు, బాలికలపై నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలున్నప్పటికీ నేరస్థులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థినిని యువకుడు దారుణంగా కొడుతూ హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి సీఎం దగ్గరకు చేరింది. దీంతో సీఎం కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకోని జైలుకు పంపారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రంలో స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న గిరిజన అమ్మాయిని ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. ఈ ఘటనను అతని స్నేహితులు వీడియోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే.. గిరిజన బాలికపై జరిగిన దాడి వీడియోని రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్వీట్‌ చేశారు. ఇది పాకూర్‌లో జరిగిందని దానిలో రాశారు. దీంతో ఈ వీడియోను చూసిన సీఎం హేమంత్‌ సోరేన్‌.. షేర్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

స్కూల్‌ డ్రెస్‌ ఆధారంగా ఆ అమ్మాయి దుమ్కా జిల్లా పాకూర్‌లోని సెయింట్‌ స్టానిస్లాస్‌ హెచ్‌ఎస్‌ హతిమారా పాఠశాలలో చదువుతున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన యువకుడు.. రోలమారా గ్రామానికి చెందిన యువకుడి గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

వీడియో..

యువకుడు 9వ తరగతి చదువుతున్నాడని.. పాకూర్ ఎస్పీ హృదీప్ పి జనార్దనన్ తెలిపారు. ఇద్దరూ గిరిజన కుటుంబాలకు చెందిన వారని.. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిపారు. అయితే ఈ ఘటన 15 రోజుల క్రితం జరగగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని తెలిపారు.