కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే బాంబ్ మేకర్ హతం..

| Edited By:

Jul 27, 2019 | 2:06 PM

ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం తెల్లవారుజామును షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జైషే టాప్ బాంబ్ మేకర్.. మున్నా లాహోరీ.. అలియాస్ బిహారీని భద్రతా బలగాలు హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో మున్నా మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అతనితో పాటుగా మరో ఉగ్రవాది కూడా హతమైనట్లు తెలిపారు. అయితే అతడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మున్నా లాహోరీ… దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో అనేక ఐఈడీ దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. […]

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే బాంబ్ మేకర్ హతం..
Follow us on

ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం తెల్లవారుజామును షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జైషే టాప్ బాంబ్ మేకర్.. మున్నా లాహోరీ.. అలియాస్ బిహారీని భద్రతా బలగాలు హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో మున్నా మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అతనితో పాటుగా మరో ఉగ్రవాది కూడా హతమైనట్లు తెలిపారు. అయితే అతడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మున్నా లాహోరీ… దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో అనేక ఐఈడీ దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

పాకిస్తాన్‌కు చెందిన మున్నా.. గతేడాది కశ్మీర్‌లోకి చొరబడ్డాడు. జైషే ఉగ్రవాదుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా.. వాహనాల్లో బాంబులు వినియోగించడంలో ఇతడు సిద్ధహస్తుడని అధికారులు చెబుతున్నారు. కశ్మీర్ లోయలోని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు, రిక్రూట్ చేసుకునేందుకు జైషే మహ్మద్ ఇతడిని ఉపయోగించుకునేదని తెలిపారు.