
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ఖాతాలో మరో ఘనత నమోదైంది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ, ఇస్రో వాణిజ్య విభాగం సంయుక్తంగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్-2 అనే సుమారు 6,100 కిలోలు బరువుగల భారీ ఉపగ్రహాన్ని LVM-3 M6 అనే బాహుబలి రాకెట్ ద్వారా నింగిలోకి పంపిచారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో శాత్తవేత్తలు కేవలం 15 నిమిషాల్లో విజయవంతం చేశారు.
నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M6 రాకెట్ నిర్దేశిత కక్ష్యలో 15.07 నిమిషాల్లో మూడు దశలు పూర్తి చేసుకొని ఎర్త్ ఆర్బిట్(లియో)లోకి బ్లాక్ బర్డ్ను ప్రవేశపెట్టింది. బుధవారం ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోట నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.ఇస్రో చరిత్రలో లోనే ఇంత భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పెస్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంభరాలు జరుపుకున్నారు.
వీడియో చూడండి..
A significant stride in India’s space sector…
The successful LVM3-M6 launch, placing the heaviest satellite ever launched from Indian soil, the spacecraft of USA, BlueBird Block-2, into its intended orbit, marks a proud milestone in India’s space journey.
It strengthens… pic.twitter.com/AH6aJAyOhi
— Narendra Modi (@narendramodi) December 24, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.