AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ మాటను లెక్కచేయని భారత్‌..! ఆ దేశం నుంచి ఆయిల్‌ కొనుగోలు కొనసాగింపు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించినప్పటికీ, భారతదేశం రష్యా నుండి చమురు దిగుమతిని కొనసాగిస్తోంది. ధర, నాణ్యత, లాజిస్టిక్స్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు లేకపోవడం కూడా ఇందు కు కారణం.

ట్రంప్‌ మాటను లెక్కచేయని భారత్‌..! ఆ దేశం నుంచి ఆయిల్‌ కొనుగోలు కొనసాగింపు..
Pm Modi And Trump
SN Pasha
|

Updated on: Aug 02, 2025 | 3:51 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకాలు విధించినప్పటికీ.. భారత ప్రభుత్వం ట్రంప్‌ను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. భారత చమురు శుద్ధి కర్మాగారాలు ఇప్పటికీ రష్యన్ సరఫరాదారుల నుండి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ధర, ముడి చమురు గ్రేడ్, జాబితా, లాజిస్టిక్స్, ఇతర ఆర్థిక అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రష్యా నుండి చమురును సేకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా రష్యాపై అమెరికా, యూరపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించలేదు. అందువల్ల మాస్కో చమురు కొనుగోలు చేయడం ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కాదు. ఇండియన్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు (OMCలు) ఇరానియన్ లేదా వెనిజులా ముడి చమురును కొనుగోలు చేయలేదు ఎందుకంటే ఈ దేశాలు అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా భారత OMCలు ఎల్లప్పుడూ US సిఫార్సు చేసిన రష్యన్ చమురు ధర పరిమితికి కట్టుబడి ఉన్నాయని, EU ఇటీవల రష్యన్ ముడి చమురు ధరకు 47.6 డాలర్ల పరిమితిని సిఫార్సు చేసిందని, ఇది సెప్టెంబర్ నుండి అమలు కానుంది. భారత్‌ తన డిమాండ్లను తీర్చుకోవడానికి దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా భాగస్వాములను ఏర్పాటు చేసుకుంటోంది.

రష్యా నుంచే ఎందుకు?

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో ఒకటి. రోజుకు దాదాపు 9.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇది మొత్తం ప్రపంచం ఉపయోగించే దానిలో దాదాపు 10 శాతం. తాన ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని ఎగుమతి చేస్తుంది. ప్రతిరోజూ దాదాపు 4.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, 2.3 మిలియన్ బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. భారత్‌ చౌకగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. మార్చి 2022లో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యన్ చమురును ప్రపంచ మార్కెట్ నుండి నిషేధించవచ్చో లేదా తొలగించవచ్చో అనే ఆందోళనలు తలెత్తాయి. తగినంత చమురు అందుబాటులో ఉండదని ప్రజలు భయపడ్డారు. ఫలితంగా ప్రపంచ చమురు ధరలు బాగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 137 డాలర్లకు చేరుకుంది.

ట్రంప్‌ ఏమన్నారంటే..?

భారత్‌ రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు. దీనిని ‘మంచి అడుగు’ అని అభివర్ణించారు. భారతదేశంపై సుంకాలు, ప్రధాని మోడీతో తన సంభాషణ గురించి ప్రశ్నించినప్పుడు, ట్రంప్ మాట్లాడుతూ, “భారతదేశం ఇకపై రష్యా నుండి చమురు కొనుగోలు చేయబోదని నాకు అర్థమైంది. ఏమి జరుగుతుందో చూద్దాం.” అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us