AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన సిద్ధం.. ఎక్కడంటే

భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తైంది. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.

దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన సిద్ధం.. ఎక్కడంటే
Cable Rail Bridge
Aravind B
|

Updated on: Apr 30, 2023 | 6:40 AM

Share

భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తైంది. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ఈ తీగల పొడవు మొత్తం 653 కిలోమీటర్లు ఉందని తెలిపారు. ఆ వంతెనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మంత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఎక్స్‌లెంట్ అంటూ ప్రశంసించారు. ఇదిలా ఉండగా దాదాపు రూ.400 కోట్లతో ఈ వంతెన పనులు చేపట్టారు. దీని మొత్తం పొడవు 725 మీటర్లు. అయితే ఈ అంజీఖడ్ తీగల రైల్వే వంతెన జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాట్రా- రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల నడుమ అంజీఖడ్ నదిపై 1086 అడుగులు ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన సుమారు 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us