దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన సిద్ధం.. ఎక్కడంటే
భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తైంది. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.

భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలో మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తైంది. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ఈ తీగల పొడవు మొత్తం 653 కిలోమీటర్లు ఉందని తెలిపారు. ఆ వంతెనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.
అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మంత్రి ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఎక్స్లెంట్ అంటూ ప్రశంసించారు. ఇదిలా ఉండగా దాదాపు రూ.400 కోట్లతో ఈ వంతెన పనులు చేపట్టారు. దీని మొత్తం పొడవు 725 మీటర్లు. అయితే ఈ అంజీఖడ్ తీగల రైల్వే వంతెన జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాట్రా- రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల నడుమ అంజీఖడ్ నదిపై 1086 అడుగులు ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన సుమారు 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలదని అధికారులు తెలిపారు.




In 11 months, India’s first cable stayed rail bridge is ready. All 96 cables set! #AnjiKhadBridge PS: Total length of cable strands 653 km? pic.twitter.com/CctSXFxhfa
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 28, 2023
Excellent! https://t.co/cwQpm6LVQX
— Narendra Modi (@narendramodi) April 29, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




