Economic Crisis: శ్రీలంక తరహాలోనే భారత్‌లోని పలు రాష్ట్రాల పరిస్థితి.. ఇప్పుడు కళ్లు తెరిస్తేనే మంచిదంటూ బ్యూరోక్రాట్ల వార్నింగ్

Indian States - Sri Lanka Economic Crisis: శ్రీలంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ముందుచూపు లేకపోవడం, ప్రజాకర్షక పథకాలు, కరోనా లాంటి అనేక అంశాలు దేశ పరిస్థితులను తీవ్రంగా దిగజార్చాయి.

Economic Crisis: శ్రీలంక తరహాలోనే భారత్‌లోని పలు రాష్ట్రాల పరిస్థితి.. ఇప్పుడు కళ్లు తెరిస్తేనే మంచిదంటూ బ్యూరోక్రాట్ల వార్నింగ్
Srilanka Modi India Map
Follow us

|

Updated on: Apr 09, 2022 | 11:55 AM

Indian States – Sri Lanka Economic Crisis: శ్రీలంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ముందుచూపు లేకపోవడం, ప్రజాకర్షక పథకాలు, కరోనా లాంటి అనేక అంశాలు దేశ పరిస్థితులను తీవ్రంగా దిగజార్చాయి. ఆహార దిగుమతులు, ఇంధనం కోసం చెల్లించడానికి సరిపడా డబ్బుల్లేక.. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరత లాంటి సమస్యలతో శ్రీలంక విలవిలలాడుతోంది. ఈ క్రమంలో భారత్ పరిస్థితిపై బ్యూరోక్రాట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు అందించే ప్రజాకర్షక పథకాలు ఆర్థిక నాశనానికి దారితీస్తాయని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో బ్యూరోక్రాట్లు హెచ్చరించారు. ఏప్రిల్ 3న జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ నిర్వహించారు. 2014 నుంచి ప్రధాని మోడీ ఈ బ్యూరోక్రాట్లతో 9 సార్లు భేటీ అయ్యారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో కొందరు కార్యదర్శులు ప్రజాకర్షక పథకాల వల్ల కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోకడలు ఇలానే కొనసాగితే కొన్ని రాష్ట్రాలు.. నగదు కొరతతో సంక్షోభంలో ఉన్న శ్రీలంక లేదా గ్రీస్ మాదిరిగానే ఇబ్బందుల్లో మునుగుతాయంటూ అధికారులు హెచ్చరించారు.

అన్ని ఉచితాలే.. ఇలా అయితే ఎలా..?

భారతదేశంలో ఎన్నికలు జరిగే క్రమంలో ఉచిత వాగ్దానాలకు బీజం పడుతుంది. ఈ సంప్రదాయం దశాబ్దాల నాటి నుంచి వస్తుందని న్యూస్9 వివరించింది. చాలా రాష్ట్రాల్లో డబ్బు లేకుండా.. ఆదాయ వనరుల గురించి ఆలోచించకుండా ఉచితాలు, జనాకర్షక పథకాలకే ఖర్చుచేస్తుండటాన్ని మనం చూడవచ్చు. ఇటీవల అధికారంలోకి వచ్చేందుకు పంజాబ్‌లోని AAP ప్రభుత్వం చేసిన వాగ్దానం ఆమోదయోగ్యం కాదు. కానీ ఇలాంటి హామీల తర్వాత ఉచితాల గురించి చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అనేక రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్, ఉచిత రేషన్లు, ఉచిత మందులతోపాటు అనేక ఇతర సేవలను సబ్సిడీ లేదా ఉచితంగా అందిస్తామంటూ వాగ్దానం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర భారం పడుతోంది. అలాగే, ఇది ఆరోగ్యం, విద్య వంటి క్లిష్టమైన సామాజిక రంగాలకు ఆర్థికంగా నష్టం జరగడంతోపాటు.. సామర్థ్యం కొంతవరకే పరిమితం అవుతోంది. తమిళనాడులో 1954 – 1963 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత కె కామరాజ్ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత ఆహారాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి వాగ్ధానాలకు బీజం పడింది. ఆ తర్వాత నుంచి ఉచిత బియ్యం, ఉచిత కలర్ టీవీలు, నగదు, పలు సౌకర్యాలు కూడా ఉచితమయ్యాయి. ఇలా.. ఉచితాలు వ్యవసాయ రుణాల మాఫీల వైపు మళ్లింది. ఇప్పుడు ఎక్కడా కూడా వెనుదిరిగి చూసే పరిస్థితి లేదని కనిపిస్తోంది.

శ్రీలంక మాదిరిగానే రాష్ట్రాలు..

జనాకర్షక పథకాలు, సబ్సిడీలను నిషేధించడంపై ఏకాభిప్రాయం లేకపోతే, కొన్ని రాష్ట్రాలు శ్రీలంక లాగా సంక్షోభంలో చిక్కుకోవడానికి ఎక్కువ కాలం పట్టదంటూ వ్యాసకర్త సందీపన్ శర్మ పేర్కొన్నారు. ఊహాత్మక ప్రపంచంలో, పంజాబ్ స్వతంత్ర దేశంగా ఉంటే, దాని ఆర్థిక పరిమితులు కొన్ని శ్రీలంకతో సమానంగా ఉంటాయంటూ ఆయన రాశారు. రాష్ట్రాలకు, దేశాలకు ఒకే విధమైన ఆదాయాలు ఉండేవి. అలానే శ్రీలంక, పంజాబ్ ను పోల్చుకుంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ స్థూల దేశీయోత్పత్తి (GDP) దాదాపు రూ. 6,07,594 కోట్లు (సుమారు $80 బిలియన్లు) కలిగి ఉంది. ఈ కాలంలో శ్రీలంక GDP సరిగ్గా అదే గణాంకాల్లో ఉంది..– $80 బిలియన్లు.

పంజాబ్ అంచనా రుణం/GDP నిష్పత్తి ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా 53.3 శాతంగా ఉంది. ఇప్పుడు, పంజాబ్ స్వతంత్ర దేశానికి అవసరమైన వాటిపై ఖర్చు చేయవలసి వస్తే– రక్షణ, సామూహిక టీకా లాంటివి. అదనపు ఆదాయం లేకపోతే ఇది స్పష్టంగా ఎక్కువ రుణం తీసుకోవలసి ఉంటుంది. ఇది దాని రుణం/GDP నిష్పత్తిని మరింత ఎక్కువగా తీసుకుంటుంది. బహుశా జీడీపీ మరో 10 శాతం ఉండవచ్చు. ఈ స్వతంత్ర దేశం దాని జిడిపిలో దాదాపు 65 శాతానికి సమానమైన రుణాన్ని కలిగి ఉండవచ్చు. నేడు శ్రీలంక ఆర్థికంగా చితికిపోయింది. దీని రుణం/GDP నిష్పత్తి దాదాపు 120 శాతం. అప్పు తీర్చడం, దిగుమతుల కోసం చెల్లించడం.. దేశాన్ని నడిపించడం కష్టంగా మారింది. కేవలం ఒక దశాబ్దం క్రితం ఈ రోజు పంజాబ్ సరిగ్గా 70 శాతం రుణ నిష్పత్తితో ఉంది.

ఇక్కడ విషయం ఏమిటంటే.. పంజాబ్ లాగా, అనేక భారతీయ రాష్ట్రాలు శ్రీలంక లాగా తయారవుతున్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీలు, రక్షణ, ఇనాక్యులేషన్ డ్రైవ్‌ల వంటి విషయాలపై ఖర్చుల ద్వారా ఆదా చేయబడుతున్నాయి. ఈ రాష్ట్రాలు తమ అవసరాల్లో కొంత భాగాన్ని చూసుకుంటూ, అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేసే దిశగా మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. GDPలు $130-50 బిలియన్ల పరిధిలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలను పరిశీలిస్తే మనందరికీ అర్ధం అవుతుంది. వారందరికీ 25 కంటే ఎక్కువ రుణ/GDP నిష్పత్తులు ఉన్నాయి. ఇవి ఆందోళనకరమైనవిగా పరిగణిస్తారు.

Gdp

Gdp

2017లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (FRBM) ప్యానెల్ FY23 నాటికి GDPలో 60% సాధారణ ప్రభుత్వ రుణాలకు (కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ) పరిమితిని సూచించింది. ఈ మొత్తం పరిమితిలో, కేంద్రం 40%, రాష్ట్రాలు 20% పరిమితిని ఆమోదించాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇరవై నాలుగు రాష్ట్రాలు (కేంద్రపాలిత ప్రాంతాలు) వాటి GDP నిష్పత్తి ప్రకారం 30 శాతం కంటే ఎక్కువ రుణాన్ని కలిగి ఉన్నాయి. గుజరాత్ (21.4 శాతం), మహారాష్ట్ర (20.4) మాత్రమే ఎఫ్‌ఆర్‌బిఎం లక్ష్యం 20 శాతానికి చేరువలో ఉన్నాయి. మొత్తంగా, రాష్ట్రాల రుణ నిష్పత్తి దాదాపు 32 శాతం. మొత్తం కలిపి రాష్ట్రాల రుణ నిష్పత్తి దాదాపు 32 శాతం ( రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి vs అన్ని రాష్ట్రాల రుణ నిష్పత్తి ఇక్కడ అందుబాటులో ఉంది ).

దీంతో కేంద్రం అప్పులు అదుపులో ఉంచుకోవాలని చెప్పకతప్పదు. తాజా అంచనాల ప్రకారం, 2021-22లో భారతదేశ రుణం/GDP నిష్పత్తి దాదాపు 59 శాతంగా ఉండవచ్చు.

అయినప్పటికీ చాలా రాష్ట్రాలు జనాకర్షక, ఉచిత పథకాలను అందించేందుకు.. శ్రీలంక లాగా బాగా ఖర్చు చేస్తున్నాయి. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పన్ను రేట్లను తగ్గించింది. పెన్షన్ పథకాలను రూపొందించింది. ఒక్క పైసా కూడా సంపాదించకుండా యువతకు వడ్డీ లేని రుణాలను అందించింది. మహమ్మారి కారణంగా దాని ఆదాయం మరింత పడిపోవడంతో శ్రీలంక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలింది. నాయకులకు దురదృష్టి లేకపోవడంతో దేశం నాశనం అయింది.

ఇలాంటి అప్పుల భారం ఉన్న భారత్‌లోని పలు రాష్ట్రాలు కూడా అదే పని చేస్తున్నాయి. పంజాబ్‌లో భగవంత్ మాన్ ఎన్నికల ముందు ఉచితాలను వాగ్దానం చేశారు. ఇప్పుడు, ఖర్చు చేయడానికి డబ్బు లేకపోవడంతో ఆయన లక్ష కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని అడుగుతున్నారు.

అలాగే.. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ఖజానాకు ఎక్కువ ఖర్చు చేసే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 2023 ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉచిత విద్యుత్, కొన్ని ఇతర జనాకర్షక పథకాలను కూడా ఆయన ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఉచిత రేషన్‌, నగదు బదిలీని కూడా ప్రారంభించింది. ఇతర రాష్ట్రాలు కూడా నిధులు, సబ్సిడీలను ఎన్నికల వ్యూహంగా మార్చాయి. దీంతో ఆర్థిక పరిస్థితిపై మరింత ఒత్తిడి పెరిగింది.

ఈ పరిస్థితుల్లో కేంద్రం కూడా తెలివిగా వ్యవహరించడం లేదు. భారత్ చాలా కాలం క్రితం ఇంధనం నిర్వహణకు ధరల విధానాన్ని రద్దు చేసింది. కానీ, రాజకీయ లెక్కలను బట్టి ఇప్పటికీ ఇంధన ధరలను కేంద్రమే నిర్ణయిస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎన్నికలు సమయాన్ని పరిశీలిస్తే ఇదే అర్ధమవుతుంది. ఎన్నికల సమయంలో ముడిచమురు ధరలు పెరిగినప్పుడు కూడా చమురు కంపెనీలు రేట్లను మార్చకుండా బలవంతంగా ఉంచే పరిస్థితికి చేరింది. ఈ కృత్రిమ నియంత్రణ చమురు కంపెనీల ధరలను ప్రభావితం చేస్తాయి. చివరికి కేంద్రం ఆదాయాన్ని దెబ్బతీస్తాయి.

జనాకర్షక ఉచిత పోటీ చివరికి భారతదేశాన్ని ఆర్థిక నాశనానికి దారి తీస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పతనంలో ఉన్నాయి. కానీ అవి కేంద్రం నీడలో పయనిస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే వివేకం లేకుండా ఖర్చు చేసే ప్రతీ రూపాయి దేశాలను నాశనం చేస్తుంది.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఎల్లప్పుడూ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. మరుగుదొడ్లు నిర్మించడం, గృహావసరాలకు వంటగ్యాస్‌ సదుపాయం కల్పించడం, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి పథకాలకు నగదును మళ్లించాల్సి ఉంటుంది. మహమ్మారి వంటి విపత్తుల సమయంలో రాష్ట్రాలు కూడా ఉచిత రేషన్లు, ప్రత్యక్ష నగదు బదిలీలలో జోక్యం చేసుకోవలసి ఉంటుంది. సంక్షేమం దృష్ట్యా వీటిని బహిష్కరించలేము. దీంతో పేదరికం నుంచి బయటపడిన ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరి దేశ జిడిపికి దోహదపడతారు.

కానీ సమస్య రాజకీయ ప్రజాకర్షణలో ఉంది. ఎన్నికలలో గెలవడానికి ఖజానాను ఉపయోగించాలనే ఆలోచన తీవ్రంగా నష్టపరుస్తోంది. ఉచిత నీరు, కరెంటు, ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, మొబైల్‌లు, బస్సులు, రైలు ప్రయాణాలు, కొంత మంది ఓటర్లకు నగదు వంటి వాగ్దానాలు ప్రతికూలంగా ఉన్నాయి. అన్ని కూడా ఖజానాకు గండికొడతాయి. ఇది ఆస్తులను సృష్టించడం ద్వారా జనాకర్షక బహుమతుల సంస్కృతిని సృష్టిస్తుంది. MNREGA పథకం కూడా ఇదే సూచిస్తుంది. భౌతిక ఆస్తులను సృష్టించకుండా లేదా శ్రామిక శక్తి ఉత్పాదకతను పెంచకుండా కేవలం కార్మికులకు మేలు చేసే పథకంగానే ఉంది. ప్రస్తుతం ఈ పథకంలో మార్పులు చేశారు.

కావున భారతదేశంలోని రాష్ట్రాలు శ్రీలంకగా మాదిరిగా మారకుండా ఉండేందుకు.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందీపన్ శర్మ అభిప్రాయపడ్డారు.

Also Read:

Imran Khan: భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఏ దేశానికి లేదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

CJI NV Ramana: ‘ప్రభుత్వం న్యాయమూర్తుల పరువు తీస్తోంది.. ఈ కొత్త ట్రెండ్ మొదలైంది’.. సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు!