AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army: పాక్‌కు షాక్ ఇచ్చిన భారత్.. ఆపరేషన్‌ సింధూర్‌పై మరో కీలక ప్రకటన!

ఆపరేషన్‌ సింధూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో ప్రకటన చేసింది. భారత్‌లోని ప్రధాన నగరాలే లక్షంగా డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలోకి వచ్చిన పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సాధారణ పౌరులపై పాకిస్తాన్‌ దాడులకు తెగబడుతోందని..ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.

Indian Army: పాక్‌కు షాక్ ఇచ్చిన భారత్.. ఆపరేషన్‌ సింధూర్‌పై మరో కీలక ప్రకటన!
Pak Attack
Follow us
Anand T

|

Updated on: May 10, 2025 | 10:09 AM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తలు తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్‌పై ప్రతీకార చర్యలను స్టార్ట్ చేసింది. భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లోని నగరాలే టార్గెట్‌గా పదే పదే కాల్పులు, డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడుతోంది. ఇక పాకిస్తాన్‌ దాడులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.

ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున భారత్‌లోకి వచ్చిన పాక్‌ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. భారత్‌లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలోని సాధారణ పౌరులపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. గగనతలంలో పాక్‌ డ్రోన్లను గుర్తించిన ఇండియన్ ఆర్మీ అప్రమత్తమై వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తమ దగ్గరున్న అధునాత ఆయుధాలతో పాకిస్తాన్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ నేల కూల్చింది. ఇకపోలే సాధారణ పౌరులపై పాక్‌ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఆర్మీ తన “ఎక్స్‌” ఖాతా ద్వారా వెలువరించింది.

మరోవైపు భారత్‌లోని ప్రధాన నగరాల టార్గెట్‌గా పాకిస్తాన్ ఫతాహ్ -2 మిస్సైల్ ను ప్రయోగించింది. కానీ  ఆ మిసైళ్లను భారత్ ఆర్మీ సమర్ధవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ మిసైళ్లను భారత్‌ గాళ్లోనే అంతమొందించింది. పదే పదే డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు బుద్ది చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ -2 పేరుతో పాకిస్తాన్‌లోని కీలక వైమానిక స్థావరాలపై భారత్‌ దాడి చేసినట్టు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సహా  మరో మూడు పాక్ ప్రధాన వైమానిక స్థావరాలపై  బిలిస్టన్ క్షిపణి సహా, మిస్సైళ్లు, డ్రోన్ల వర్ష కురిపించింది. భారత్‌ దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భారత్ సైన్యం ప్రతీకార చర్యలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్ తన గగన తలాన్ని మూసివేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకు జుట్టు రాలుతుందా..? కారణం ఇదేనట.. ఆ లోపం ఉంటే మాత్రం..
మీకు జుట్టు రాలుతుందా..? కారణం ఇదేనట.. ఆ లోపం ఉంటే మాత్రం..
అరటిపండ్లు కొనేముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!
అరటిపండ్లు కొనేముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!
ఇక దేశంలోని ప్రతి మూలలో వైఫై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
ఇక దేశంలోని ప్రతి మూలలో వైఫై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
హనుమంతుడు మా ఇంటికి వచ్చాడు..
హనుమంతుడు మా ఇంటికి వచ్చాడు..
బటయపడుతున్న మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భార్య లీలలు.. ఇంత కౄరురాలా?
బటయపడుతున్న మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భార్య లీలలు.. ఇంత కౄరురాలా?
జియో ప్లాన్..300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం
జియో ప్లాన్..300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం
నీటి అడుగున తేలియాడుతున్న వింత ఆకారం.. అటుగా అనకొండలు..
నీటి అడుగున తేలియాడుతున్న వింత ఆకారం.. అటుగా అనకొండలు..
అప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్
అప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..! ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాలు..
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..! ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాలు..
తత్కాల్ టిక్కెట్లు బుక్ కావడానికి సులభమైన మార్గాలేంటో తెలుసా?
తత్కాల్ టిక్కెట్లు బుక్ కావడానికి సులభమైన మార్గాలేంటో తెలుసా?
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో