AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona: కాస్త ఉపశమనం.. దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు.. నిన్న ఎన్నంటే..?

Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఇటీవల కాలంలో పెరుగుతున్న

India Corona: కాస్త ఉపశమనం.. దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు.. నిన్న ఎన్నంటే..?
India Corona
Shaik Madar Saheb
|

Updated on: Sep 10, 2021 | 10:06 AM

Share

Covid-19 Cases in India: భారత్‌లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఇటీవల కాలంలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచివుందని జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోల్చుకుంటే.. గురువారం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే.. 9 వేల కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 34,973 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,74,954 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,42,009 చేరింది. నిన్న కరోనా నుంచి 37,681 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,23,42,299 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,90,646 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

కాగా.. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో 80 శాతానికి పైగా కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గురువారం కేరళలో 26,200 కరోనా కేసులు నమోదు కాగా.. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Hyderabad: దిశ తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయండి.. చిన్నారి హత్యపై స్థానికుల తిరుగుబాటు.. సైదాబాద్‌లో ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి..