మానవతకు చిరునామాగా నిలిచారు ఆ జవాన్లు !

మరణించిన వ్యక్తి ఎవరో తమకు తెలియదు. అతనితో తమకు ఎలాంటి సంబంధాలూ లేవు. కనీసం పరిచయం కూడా లేదు. కానీ అతని మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకుని భుజాన మోసుకుంటూ...

మానవతకు చిరునామాగా నిలిచారు ఆ జవాన్లు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 02, 2020 | 12:02 PM

మరణించిన వ్యక్తి ఎవరో తమకు తెలియదు. అతనితో తమకు ఎలాంటి సంబంధాలూ లేవు. కనీసం పరిచయం కూడా లేదు. కానీ అతని మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకుని భుజాన మోసుకుంటూ ఎనిమిది మంది జవాన్లు 25 కి.మీ. దూరం, 8 గంటలపైగా నడిచారు. ఉత్తరాఖండ్ పితోరాఘడ్ జిల్లాలోని సియునీ అనే మారుమూల గ్రామం నుంచి మున్సారీ అనే మరో పల్లె చేరేందుకు వారీ ‘సాహసం’ చేశారు. ఈ గ్రామంలో ఈ అపరిచిత వ్యక్తి మృత దేహాన్ని అతని బంధువులకు అప్పగించేందుకు రాళ్లు, గుట్టలతో నిండిన దుర్గమ మార్గం ద్వారా ప్రయాణించారు. 30 ఏళ్ళ ఈ వ్యక్తి రాళ్లు కొడుతూ హఠాత్తుగా చనిపోయాడని తెలిసిన ఇండో-టిబెటన్ బోర్డర్ జవాన్లు ఇలా తమ మానవతను చాటుకున్నారు.