
ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసిన క్షిపణి దాడి ప్రయత్నాలను భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. అయితే.. పాకిస్థాన్ ఏకధాటిగా క్షిపణులు, డ్రోన్లతో మన దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇండియా ఎలా వాటిని తప్పికొడుతోంది. క్షిపణులను, డ్రోన్లను ఎలా గాల్లోనే పేల్చేస్తోంది. అందుకోసం మన దగ్గరున్న వ్యవస్థ ఏంటి? వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పాకిస్థాన్ చేసే దాడులను అడ్డుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు సమాచారం.
పాకిస్తాన్ సైన్యం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్లను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. S-400 అనేది 400 కిలో మీటర్ల వరకు పరిధి కలిగిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలదు. దీన్ని ప్రత్యేకంగా స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్తో సహా వివిధ వైమానిక లక్ష్యాలను అడ్డగించడానికి రూపొందించారు. దీనిని రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది.
రష్యా నుండి S-400 డిఫెన్స్ సిస్టమ్, బహుళ బ్యాటరీలను కొనుగోలు చేసింది భారత్. వాటిని చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట మోహరించింది. 2007 నుంచి ఈ S-400 మన రక్షణ కోసం పనిచేస్తోంది. దీనిని 2007 నుండి రష్యన్ సాయుధ దళాలు ఇతర అంతర్జాతీయ ఆపరేటర్లు ఉపయోగిస్తున్నారు. రష్యాలో తయారైన S-400 ట్రయంఫ్ క్షిపణిని ప్రవేశపెట్టడం వలన భారత రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. దీనికి సాటిలేని వేగం, రహస్య క్షిపణి, స్వదేశీ వ్యవస్థలతో నెట్వర్క్డ్ ఏకీకరణ ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..