హర్యానాలో దారుణం.. బీఫ్ తిన్నాడన్న అనుమానంతో వలస కూలీపై దాష్టీకం..!
హర్యానాలో గో రక్షాదళ్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బీఫ్ తిన్నాడన్న అనుమానంతో బెంగాల్కు చెందిన వలస కార్మికుడిని కొట్టిచంపారు. చర్కీ దాద్రీ జిల్లా బాంద్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాబీర్ మాలిక్పై దాడికి పాల్పడ్డ ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హర్యానాలో గో రక్షాదళ్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బీఫ్ తిన్నాడన్న అనుమానంతో బెంగాల్కు చెందిన వలస కార్మికుడిని కొట్టిచంపారు. చర్కీ దాద్రీ జిల్లా బాంద్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాబీర్ మాలిక్పై దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది హర్యానా ప్రభుత్వం. ఆగస్ట్ 27న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హర్యానాలోని చర్కీ దాద్రీలో గొడ్డు మాంసం తిన్నాడనే అనుమానంతో పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ స్పందన వెలుగులోకి వచ్చింది. ఆవు మాతృమూర్తి పట్ల ప్రజలకు సెంటిమెంట్లు ఉన్నాయని అన్నారు. చర్కీ దాద్రీ ఘటన దురదృష్టకరమని, మాతృ గోవుల రక్షణ కోసం చట్టం చేశామన్నారు.
సీఎం నయాబ్ సింగ్ సైనీ ఈ ఘటనపై స్పందించారు. “మాబ్ లిన్చింగ్ చర్చలు సరైనవి కావు. మాతృ గోవుల రక్షణ కోసం అసెంబ్లీలో కఠిన చట్టం చేశాం. గోమాత విషయంలో రాజీ లేదు. గ్రామంలో గోమాతకి చాలా గౌరవం. అయితే ఇలాంటి ఘటనలు జరగకూడదని, ఇది దురదృష్టకరం. ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు. దీనిని నివారించేందుకు కఠిన చర్యలు ఉంటాయి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
#WATCH | Haryana: Charkhi Dadri police have arrested 7 people including 2 minors in connection with the murder of a migrant in Badhra village. The deceased has been identified as Sabir Malik. The arrested persons have been identified as Abhishek, Ravinder, Mohit, Kamaljeet and… pic.twitter.com/uMUuXhrs98
— ANI (@ANI) August 31, 2024
ఆగస్టు 27న జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు అమ్ముతున్నాడనే నెపంతో ఓ దుకాణానికి పిలిపించి కొట్టారని చెబుతున్నారు. తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ యువకుడు చెత్త సేకరించే పని చేస్తాడు. మృతుడిని బెంగాల్కు చెందిన సాబీర్ మాలిక్గా గుర్తించారు.
ఇద్దరు వలస యువకులను కర్రలతో కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మృతుడు చర్కీ దాద్రీ జిల్లా బాంద్రా గ్రామంలోని మురికివాడలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం, గోసంరక్షణ సమితి సభ్యులు గొడ్డు మాంసం వినియోగంపై మురికివాడలో గందరగోళం సృష్టించారు. నిందితులను అభిషేక్, మోహిత్, కమల్జీత్, సాహిల్, రవీందర్లుగా గుర్తించారు. ఇండియన్ జస్టిస్ కోడ్లోని సంబంధిత సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.