AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారులోనే ప్రాణాలొదిలిన వ్యాపారి కుటుంబం.. డోర్ లాక్ చేసుకుని ఏడుగురు..

నివాస ప్రాంతంలో.. రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది.. చాలా సేపటి నుంచి అక్కడే ఉంది.. ఉన్నట్టుండి కారులోపల నుంచి అరుపులు.. కేకలు వినిపిస్తున్నాయి.. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. వెంటనే అక్కడికి వచ్చి కారు డోర్ తీసేందుకు ప్రయత్నించారు. కానీ.. లాక్ చేసి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు..

కారులోనే ప్రాణాలొదిలిన వ్యాపారి కుటుంబం.. డోర్ లాక్ చేసుకుని ఏడుగురు..
Dehradun Family Suicide
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2025 | 8:47 AM

Share

నివాస ప్రాంతంలో.. రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది.. చాలా సేపటి నుంచి అక్కడే ఉంది.. ఉన్నట్టుండి కారులోపల నుంచి అరుపులు.. కేకలు వినిపిస్తున్నాయి.. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. వెంటనే అక్కడికి వచ్చి కారు డోర్ తీసేందుకు ప్రయత్నించారు. కానీ.. లాక్ చేసి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు.. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చెక్ చేశారు.. కారు డోర్లను బ్రేక్ చేసి చూడగా.. అందులో అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు.. ఓ కారులో కుటుంబమంతా ప్రాణాలొదలిన ఈ షాకింగ్ ఘటన హర్యానాలోని పంచకులలో కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి వెలుపల రోడ్డు పక్కన కారు ఆపి లాక్ చేసి.. దానిలో అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.. మృతులను డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42) గా గుర్తించారు. వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ తల్లిదండ్రులు, భార్య, వారి ముగ్గురు (ఇద్దరు కుమార్తెలు – ఒక కుమారుడు) పిల్లలు ఉన్నారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్‌, ఆయన కుటుంబసభ్యులు సోమవారం అర్ధరాత్రి కారులోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయి, పంచకులలో ఓ అద్దింట్లో నివాసం ఉంటోంది. వ్యాపారంలో నష్టాలతో కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్న కుటుంబం చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పుల బారిన పడిన కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హనుమాన్ కథా కార్యక్రమానికి వచ్చి..

డెహ్రాడూన్ నివాసి అయిన ప్రవీణ్ మిట్టల్ సోమవారం తన కుటుంబంతో కలిసి బాగేశ్వర్ ధామ్‌లో నిర్వహించిన హనుమాన్ కథా కార్యక్రమానికి హాజరయ్యేందుకు పంచకులకు వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, వారు డెహ్రాడూన్‌కు తిరిగి వస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. స్థానికుల ప్రకారం.. కుటుంబం మొత్తం కారు లోపల ఇబ్బంది పడుతుండటాన్ని గమనించి వెంటనే 112కు డయల్ చేశారు.. దీంతో వెంటనే అధికార బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. వారంతా అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్ సీన్ బృందం, ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర అధికారులు కారు తలుపులను బలవంతంగా తెరిచి చూడగా, బాధితులు లోపల నిర్జీవంగా ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాకి అరుపు వినిపించిన దగ్గర ఈ ఒక్క పని చేయండి.. అవి మనకు..
కాకి అరుపు వినిపించిన దగ్గర ఈ ఒక్క పని చేయండి.. అవి మనకు..
ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం కొత్త కండీషన్
ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం కొత్త కండీషన్
స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
OTT Movie: 'రానా నాయుడు'కు మించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: 'రానా నాయుడు'కు మించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి
హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి
దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభం అప్పుడే.. రైల్వేశాఖ డెసిషన్
దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభం అప్పుడే.. రైల్వేశాఖ డెసిషన్
వేసవిలో ఈ ఒక్క మొక్క పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!
వేసవిలో ఈ ఒక్క మొక్క పెంచితే చాలు.. మీ ఇల్లు పూలవనమే..!
టెస్టుల్లో టీమిండియాకు అసలు సిసలు పరీక్ష అక్కడే
టెస్టుల్లో టీమిండియాకు అసలు సిసలు పరీక్ష అక్కడే
పసుపు కల్తీని పట్టేయండిలా.. ఈ చిన్న టెస్ట్ తో మీ లివర్ సేఫ్!
పసుపు కల్తీని పట్టేయండిలా.. ఈ చిన్న టెస్ట్ తో మీ లివర్ సేఫ్!
మీ వంటింట్లోనే ఉన్నాయ్.. కిడ్నీలను రీఛార్జ్ చేసే సూపర్ ఫుడ్స్
మీ వంటింట్లోనే ఉన్నాయ్.. కిడ్నీలను రీఛార్జ్ చేసే సూపర్ ఫుడ్స్