ఢిల్లీ ఘర్షణలపై ఆర్ఎస్ఎస్ స్పందన ఇదే..

| Edited By:

Feb 28, 2020 | 2:01 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతుంటే.. అదే సమయంలో అనుకూలంగా ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికీ 38 మంది మృతిచెందగా.. మరో 200 మందికి పైగా.. గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రీయ స్వయం సేవక్ […]

ఢిల్లీ ఘర్షణలపై ఆర్ఎస్ఎస్ స్పందన ఇదే..
Follow us on

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతుంటే.. అదే సమయంలో అనుకూలంగా ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికీ 38 మంది మృతిచెందగా.. మరో 200 మందికి పైగా.. గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది.

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అభిప్రాయపడింది. ఢిల్లీలో పరిస్థితులు చక్కదిద్దే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా స్పందించారు. హింసాత్మక ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. శాంతియుత పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయని నిర్ధారించాలన్నారు.