AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi – G20: ఇవాళ ఇండోనేషియాకు ప్రధాని మోడీ.. జీ-20 సదస్సులో బ్రిటన్ పీఎం రిషి సునాక్‌తో భేటీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 సదస్సులో భాగంగా రెండురోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు కోసం ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

PM Modi - G20: ఇవాళ ఇండోనేషియాకు ప్రధాని మోడీ.. జీ-20 సదస్సులో బ్రిటన్ పీఎం రిషి సునాక్‌తో భేటీ..!
Pm Modi Rishi Sunak
Shaik Madar Saheb
|

Updated on: Nov 14, 2022 | 4:43 AM

Share

PM Modi – G20: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 సదస్సులో భాగంగా రెండురోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు కోసం ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటన కోసం ప్రధాని మోడీ సోమవారం బాలీకి బయలుదేరనున్నారు. జీ20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచ అధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బిజీబిజీగా కొనసాగే టూర్‌లో.. ప్రధాని మోడీ బాలీ ద్వీపంలో సుమారు 45గంటలపాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా మోడీ దాదాపు 20 భేటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోడీ బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ హెల్త్‌ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి అంశాలపై మోదీతోపాటు ఇతర నేతలు చర్చిస్తారని అన్నారు. దీంతోపాటు ప్రధాని మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.

G20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. దీనికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు