PM Modi – G20: ఇవాళ ఇండోనేషియాకు ప్రధాని మోడీ.. జీ-20 సదస్సులో బ్రిటన్ పీఎం రిషి సునాక్‌తో భేటీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 సదస్సులో భాగంగా రెండురోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు కోసం ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

PM Modi - G20: ఇవాళ ఇండోనేషియాకు ప్రధాని మోడీ.. జీ-20 సదస్సులో బ్రిటన్ పీఎం రిషి సునాక్‌తో భేటీ..!
Pm Modi Rishi Sunak
Follow us

|

Updated on: Nov 14, 2022 | 4:43 AM

PM Modi – G20: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 సదస్సులో భాగంగా రెండురోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు కోసం ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటన కోసం ప్రధాని మోడీ సోమవారం బాలీకి బయలుదేరనున్నారు. జీ20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచ అధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బిజీబిజీగా కొనసాగే టూర్‌లో.. ప్రధాని మోడీ బాలీ ద్వీపంలో సుమారు 45గంటలపాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా మోడీ దాదాపు 20 భేటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోడీ బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ హెల్త్‌ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి అంశాలపై మోదీతోపాటు ఇతర నేతలు చర్చిస్తారని అన్నారు. దీంతోపాటు ప్రధాని మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.

G20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. దీనికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?