మళ్లీ భగ్గుమన్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఏ నగరంలో ఎంత?
అరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు పెరగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 74.34లు కాగా ముంబైలో రూ.80. అదే విధంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.67.14 వద్ద స్థిరంగానే నిలిచింది. అయితే ముంబైలో మాత్రం 11పైసలు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ రూ.77.28, డీజిల్ […]
అరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు పెరగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 74.34లు కాగా ముంబైలో రూ.80. అదే విధంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.67.14 వద్ద స్థిరంగానే నిలిచింది. అయితే ముంబైలో మాత్రం 11పైసలు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ రూ.77.28, డీజిల్ రూ.71.09, అలాగే నోయిడాలో రూ. 75.77, రూ. 67.56 కోల్కతాలో రూ.77.03, రూ. 69. 66కు చేరాయి. ఇదిలా ఉంటే పెరిగిన చమురు ధరలతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.