Punjab: పంజాబ్‎లో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మార్పు..ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే

|

Apr 09, 2023 | 11:28 AM

పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు మారుతాయని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయ పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది.

Punjab: పంజాబ్‎లో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మార్పు..ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే
Cm Bhagwant Mann
Follow us on

పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు మారుతాయని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయ పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. అయితే మే 2 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసేలా పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. ఈ కొత్త పనివేళలు జులై 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చాలా మందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేసవిలో కరెంట్ వాడకం ఎక్కువగా పెరగడం వల్లే ఈ పనివేళలు మార్చామన్నారు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కరెంట్ వాడకం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోందని..ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకే మూసేస్తే కరెంట్ లోడ్ గరిష్ఠ స్థాయిని 350 మెగావాట్ల నుంచి 300 వరకు తగ్గించవచ్చని స్పష్టం చేశారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే తన కార్యాలయానికి చేరుకుంటానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం