Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కాంగ్రెస్ నాయకుడికి ఆ దేశమంటే ఎందుకంతా అసాధారణ ప్రేమ’ – బీజేపీ

కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భారతీయ జనతా పార్టీ పదునైన ప్రశ్నలు సంధించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో ఎక్కువ సమయం గడపడం లేదని, బదులుగా వియత్నాంలో ఎక్కువ సమయం గడుపుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.

'కాంగ్రెస్ నాయకుడికి ఆ దేశమంటే ఎందుకంతా అసాధారణ ప్రేమ' - బీజేపీ
Ravishankar Prasad Rahul Gandhi
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 16, 2025 | 9:14 AM

కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భారతీయ జనతా పార్టీ పదునైన ప్రశ్నలు సంధించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో ఎక్కువ సమయం గడపడం లేదని, బదులుగా వియత్నాంలో ఎక్కువ సమయం గడుపుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్ గాంధీ వియత్నాంలో సెలవుల్లో ఉన్నారని, ఈ సమయంలో ఆయన దాదాపు 22 రోజులు అక్కడే గడిపారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి వియత్నాం పట్ల అసాధారణమైన అనుబంధం ఉందన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా కూడా రాహుల్ గాంధీ వియత్నాంలోనే ఉన్నారని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలో ఎందుకు ఎక్కువ సమయం గడపడం లేదని ఆయన ప్రశ్నించారు. వియత్నాం పట్ల రాహుల్ గాంధీకి ఎందుకంతా అసాధారణమైన ప్రేమ ఉందో చెప్పాలన్నారు. వియత్నాంను పదే పదే సందర్శించినందుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడని, ఆయన భారతదేశంలో ఉంటూ రాజకీయాలు చేయాలని, విదేశాలకు వెళ్లడంలో బిజీగా ఉండకూడదని బీజేపీ నాయకుడు అన్నారు. రాహుల్ గాంధీకి వియత్నాం అంటే ఎందుకు అంత ప్రేమ అని ప్రసాద్ అడిగారు.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తడం కొత్త విషయం కాదు. రాహుల్ దేశీయ రాజకీయాలకు దూరంగా ఉండే గంభీరమైన నాయకుడు కాదని బీజేపీ ఎప్పుడూ చెబుతోంది. అయితే, దీనికి ప్రతిస్పందనగా, రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటనన బీజేపీ రాజకీయం చేస్తోందని, విదేశాలకు వెళ్లడం ఏ రాజకీయ నాయకుడి హక్కు కాకూడదని చెప్పడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది.

గత ఏడాది డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తర్వాత, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనను బీజేపీ తప్పుబట్టింది. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోతుంటే, రాహుల్ గాంధీ వియత్నాంలో సెలవులు గడుపారని బీజేపీ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..