AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో “బిగ్ అనౌన్స్‌మెంట్”.. హాట్ టాపిక్‌గా “పీకే” కామెంట్స్.. ఇక బీజేపీకి తిప్పలేనా..?

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ హిస్టారికల్ విన్‌లో పీకే పాత్రకూడా ఉంది. బీజేపీ ప్రచారాన్ని తట్టుకుని మరీ.. ఢిల్లీలో ఆప్ మరోసారి విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక పీకే ఫార్ములా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు.. సూచనల వల్లే.. అరవింద్ కేజ్రీవాల్ తన ఎలక్షన్ ప్రచారంలో మార్పులు […]

త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్.. హాట్ టాపిక్‌గా పీకే కామెంట్స్.. ఇక బీజేపీకి తిప్పలేనా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 14, 2020 | 1:43 AM

Share

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ హిస్టారికల్ విన్‌లో పీకే పాత్రకూడా ఉంది. బీజేపీ ప్రచారాన్ని తట్టుకుని మరీ.. ఢిల్లీలో ఆప్ మరోసారి విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక పీకే ఫార్ములా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు.. సూచనల వల్లే.. అరవింద్ కేజ్రీవాల్ తన ఎలక్షన్ ప్రచారంలో మార్పులు చేశారని తెలుస్తోంది. బీజేపీ నేతలంతా.. జాతీయాంశాలపై ప్రచారం చేపడితే.. అదే సమయంలో ఆప్ మాత్రం స్థానిక సమస్యలపైనే చర్చించింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను.. నెక్స్ట్ ఏం చేయబోతున్నానన్న అంశాలను ప్రజల్లోకి తీసుకేళ్లడంలో సక్సెస్ అయ్యారు కేజ్రీవాల్. ఈ అంశాలే కేజ్రీని విజయతీరాలకు చేర్చాయి.

కాగా ఢిల్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే.. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ లైఫ్‌‌లో పలు కీలకమార్పులు వచ్చాయి. జేడీయూలో ఉన్న ఆయన్ను.. పార్టీ నుంచి బహిష్కరించింది అధిష్టానం. అయితే అనంతరం ఆయన ఎక్కడా కూడా ఎక్కువగా ఈ విషయంపై స్పందించలేదు. తన తదుపరి రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాజాగా ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏమైనా ప్రకటిస్తారేమో అని అంతా ఎదురుచూసినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది.

దీంతో ఓ నేషనల్ మీడియా.. ప్రశాంత్ కిషోర్‌ను ప్రశ్నించగా.. ఆయన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 11 తర్వాత తానేదో కీలక ప్రకటన చేస్తానని అంతా అనుకున్నారనుకుంటా.. కానీ అందరికీ నిరాశ ఎదురైందేమో.. కానీ.. ఫిబ్రవరి 18న మాత్రం నేను ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నా.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా పీకే కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. పీకే చేయబోయే ప్రకటన ఏంటీ..? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా ప్రశాంత్ కిషోర్.. ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు, వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీకి ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ.. బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికను రూపొందించే పనిలో పీకే ఉన్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 18న చేయబోయే ప్రకటన అదేనా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు