ముఖ్యమంత్రి తల్లికి ఆసుపత్రిలో చేదు అనుభవం.. ఏం జరిగిందంటే
హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు తల్లికి ఓ ప్రభుత్వాసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వైద్యుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. ఆ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు తల్లికి ఓ ప్రభుత్వాసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వైద్యుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. ఆ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 9న హమీర్పుర్ జిల్లాలో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం తర్వాత సీఎం సుఖ్విందర్ కూడా మూడు రోజులపాటు హమీర్పుర్లోనే పర్యటించారు.
ఈ సందర్భంగా తల్లి ఫిర్యాదుపై చీఫ్ మెడికల్ అధికారిని ఆ వైద్యుని వివరణ కోరారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన వైద్యుడు తాను అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపాడు. రోగితోపాటు వచ్చిన కుటుంబసభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే కోరానని పేర్కొన్నారు. ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అయితే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక పరిశీలించాక తగు చర్యలు తీసుకొంటామని, ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




