AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: గుడ్‌న్యూస్.. పెరుగుతున్న కరోనా రికవరీలు.. నిన్న ఎంతమంది కోలుకున్నారంటే..?

ప్రస్తుతం దేశంలో 18,096 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.59 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.74 శాతం ఉంది.

India Coronavirus: గుడ్‌న్యూస్.. పెరుగుతున్న కరోనా రికవరీలు.. నిన్న ఎంతమంది కోలుకున్నారంటే..?
India Corona
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2022 | 10:00 AM

Share

India Covid Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి నాలుగు వేలకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. థర్డ్ వేవ్ అనంతరం కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అనంతరం పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగించాయి. కాగా.. గత 24 గంటల్లో (శుక్రవారం) కరోనా కేసుల సంఖ్య మూడు వేలకు దిగువన నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 2,858 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 11 మంది మరణించారు. నిన్నటితో పోల్చుకుంటే.. 17 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 18,096 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.59 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.74 శాతం ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,19,112 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,24,204 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 3,355 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,76,815 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 191,15,90,370 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 15,04,734 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా నిన్న 4,86,963 మందికి కరోనా పరీక్షలు చేశారు.
  • ఇప్పటివరకు 84.34 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Uttar Pradesh DGP: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. డీజీపీ సస్పెండ్