Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: మాస్క్‌ దుమ్ము దులపండి గురూ..! కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. బీ అలర్ట్..

మాస్క్‌ల దుమ్ము దులిపే వేళయ్యింది. డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చెయ్యాల్సిన సమయం దూసుకొస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేకపోతే రెడ్‌ ఎలర్టే..

Covid-19: మాస్క్‌ దుమ్ము దులపండి గురూ..! కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. బీ అలర్ట్..
Mask
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 22, 2022 | 9:22 AM

మాస్క్‌ల దుమ్ము దులిపే వేళయ్యింది. డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చెయ్యాల్సిన సమయం దూసుకొస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేకపోతే రెడ్‌ ఎలర్టే.. మీరు బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారా? లేకపోతే మొదట మీరు ఆ పని చేయండి. లేదంటే ప్రపంచవ్యాప్తంగా తరుముకొస్తోన్న కోవిడ్‌ భూతం మీవెంటపడుతుంది. ఇది మా మాట కాదు.. భారత ప్రభుత్వ హెచ్చరిక. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి మరోసారి కరాళనృత్యం చేయబోతోందన్న సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో అప్రకటిత హై ఎలర్ట్‌ కొనసాగుతోంది.

యావత్‌ మానవాళిని హడలెత్తించిన కరోనా మరోసారి ప్రళయం సృష్టించబోతోందా? రెండున్నరేళ్ళ పాటు ప్రపంచ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించి, సమసిపోయిందనుకున్న కోవిడ్‌ మళ్ళీ విజృంభిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చైనా ప్రజలను వదలకుండా పట్టి పీడిస్తోన్న కోవిడ్‌ సరికొత్త రూపం సంతరించుకుంది. అదే కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచదేశాల్లోనే కాదు భారత్‌లోనూ భయోత్పాతం సృష్టిస్తోంది. ఇండియాలో మొత్తం 4 కరోనా బీఎఫ్-7 కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 2, గుజరాత్‌ లో 2 కేసులను గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ కనిపించడంతో ఎయిర్‌పోర్టుల్లో హై ఎలర్ట్‌ ప్రకటించారు.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వైద్యాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కేసుల నమోదుపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత కేసులను జీనొమ్ సీక్వెన్సీకి పంపతున్నారు అధికారులు. ఇక మాస్కులు ధరించాలని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఎయిర్‌ పోర్టుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్‌ టెస్ట్‌లకూ రంగం సిద్ధం అవుతోంది.

ఇవి కూడా చదవండి

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వైద్యాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కేసుల నమోదుపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత కేసులను జీనొమ్ సీక్వెన్సీకి పంపతున్నారు అధికారులు.

తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని పాజిటివ్ కేసుల శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపాలని నిర్ణయించుకుంది.

కరోనా న్యూ వేరియంట్ ప్రమాదంతో జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.

ఏంటీ కొత్త వేరియంట్‌?

బీఎఫ్‌-7 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. దీనిపై నిపుణుల అధ్యయనం కొనసాగుతోంది. అయితే అత్యంత వేగంగా విజృంభించడం దీని ప్రథమ లక్షణంగా భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ ఇన్‌క్యుబేషన్‌ పీరియడ్‌ కూడా చాలా తక్కువని గుర్తించారు. ఈ వేరియంట్‌ ఏ వ్యాక్సిన్‌ని అయినా తట్టుకొని నిలబడగల శక్తి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!