Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పైకి చూస్తే సాధారణ సబ్బు పెట్టెలు.. తీరా చెక్ చేయగా పోలీసులకు షాక్..

మత్తుకు యువత బానిస అవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ..

Viral: పైకి చూస్తే సాధారణ సబ్బు పెట్టెలు.. తీరా చెక్ చేయగా పోలీసులకు షాక్..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2023 | 1:35 PM

మత్తుకు యువత బానిస అవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. డ్రగ్ పెడ్లర్లు మాత్రం తమ అక్రమ దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. కేసులు పెట్టినా, జైలు ఊసలు లెక్కపెట్టించినా.. ఏం ఫికర్లేదు అన్నట్లుగా క్రియేటివిటీకి పదునుపెట్టి.. మత్తు పదార్ధాలను అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి ఇలాగే కొకెయిన్‌ను అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

విదేశాల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని.. ముంబై విమానాశ్రయంలో నిందితుడి ల్యాండ్ అవుతాడనికి నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం డీఆర్ఐ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ పెంచారు. విదేశాల నుంచి వస్తోన్న ప్రతీ ప్రయాణీకుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారికి ఓ విదేశీయుడి కదలికలపై అనుమానం కలిగింది. అతడ్ని అడ్డుకుని తనిఖీలు నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. ఎవరికి కనిపించకుండా సబ్బు డబ్బాల్లో నింపిన కొకెయిన్ బయటపడింది. అతడి వద్ద మొత్తం 12 సబ్బు డబ్బాలు ఉండగా.. అందులో నుంచి సుమారు 2.58 కిలోల బరువున్న కొకెయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం.. దాని విలువ రూ. 25 కోట్లకు పైమాటేనని అధికారులు అంటున్నారు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.