
పీవోకేతో పాటు పాకిస్తాన్ను సైతం కంటికి రెప్పలా కాపాడుకోవాలి చైనా. పాకిస్తాన్ ముక్కలవుతుంటే.. డ్రాగన్ గుండె పగిలిపోతుంది. సపోజ్.. బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినా, పీవోకేను భారత్ స్వాధీనం చేసుకున్నా.. చైనా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ మొత్తం ఆగిపోతుంది. బలూచ్లోని బంగారు గనుల నుంచి బంగారాన్ని, బొగ్గు-గ్యాస్ నిక్షేపాలను దోచుకునే ఛాన్స్ రాదు. అన్నిటికీ మించి.. గ్వాదర్ పోర్ట్ను చైనా వదిలేసుకోవాల్సి ఉంటుంది. సో, పాకిస్తాన్ చల్లగా ఉండడమే చైనాకు కావాల్సింది. ఈ సీపెక్ ప్రాజెక్టుకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ప్రమాదం ఏర్పడింది. అందుకే, ఉన్నట్టుండి తాలిబన్ లీడర్లను చైనాకు పిలిపించుకుని, మాట్లాడింది చైనా. ఇంతకీ.. ఏంటీ సీపెక్.. ఈ కథనంలో తెలుసుకోండి.. ‘ఆల్ఫ్రెడ్ థయర్’ అని ఓ చరిత్రకారుడున్నారు. ఆయనో గొప్ప మాట చెప్పారు. ఎవరైతే హిందూ మహాసముద్రంపై పట్టు సాధిస్తారో.. వాళ్ల చేతికి ఆసియా ఖండం మొత్తం చిక్కుతుంది అని. అక్షరాలా నిజం ఆ మాట. పాకిస్తాన్లో లక్షల కోట్ల రూపాయలతో చైనా ఓ కారిడార్ను నిర్మిస్తున్నా, ఆఫ్ఘనిస్తాన్ను దువ్వుతున్నా, శ్రీలంక, బంగ్లాదేశ్కు విచ్చలవిడిగా అప్పులిస్తున్నా.. వీటన్నింటికీ కారణం ఇదిగో ఈ హిందూ మహాసముద్రంపై పట్టు కోసమే. ఈ వ్యూహం వెనకున్న అసలు నిజాలేంటో చూద్దాం. హిందూ మహాసముద్రం పరిధిలో మూడు ఖండాలు, మొత్తం 28 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 35 శాతం ఇక్కడే ఉంది. అంతేకాదు.. ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి మిడిల్ ఈస్ట్ మీదుగా...