చైనా కవ్వింత, బోర్డర్స్ లో దళాలను పెంచిన కేంద్రం
లడాఖ్ సరిహద్దులో చైనా ఆక్రమణల నేపథ్యంలో ఇండియా ఇతర బోర్డర్స్ లో నిఘాను, తన దళాలను పెంచింది. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోను, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోని 'ట్రై-జంక్షన్ ' ప్రాంతాల్లోనూ వాదనలు బలగాలను...
లడాఖ్ సరిహద్దులో చైనా ఆక్రమణల నేపథ్యంలో ఇండియా ఇతర బోర్డర్స్ లో నిఘాను, తన దళాలను పెంచింది. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోను, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోని ‘ట్రై-జంక్షన్ ‘ ప్రాంతాల్లోనూ వాదనలు బలగాలను మోహరిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నేపాల్ తో తనకు గల పలుకుబడిని ఉపయోగించి, చైనా ట్రబుల్ సృష్టించవచ్చునని, తన ఇంటెలిజెన్స్ ఏజన్సీల ద్వారా ఇండో-టిబెటన్ పోలీసు వంటి విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించవచ్చునని భావిస్తున్నారు. సిక్కిం ట్రై-జంక్షన్ ఏరియాలో భారత్-చైనా-టిబెట్ లను కలిపే మార్గాలున్నాయి. అలాగే ఇండో-నేపాల్ సరిహద్దుల్లోనూ భారత దళాల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా మరింతమంది సైనికులను ఇండియా మోహరిస్తోంది.