11th Instalment GST Released: కేంద్ర ప్రభుత్వం మరోసారి జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 11వ విడతగా రూ.6వేల కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. తాజాగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు విడుదల చేయగా, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలకు రూ.483.40 కోట్లు అందజేసింది. మిగతా సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో జీఎస్టీ అమలు కారణంగా ఆదాయాల్లో అంతరం లేదని తెలిపింది.
ఇప్పటి వరకు తాము అంచనా వేసినట్లు జీఎస్టీ పరిహారం కొరతలో దాదాపు 60,066.36 కోట్లు రాష్ట్రాలకు, రూ.5933.64 కోట్లు మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం రూ.66 వేల కోట్లు విడుదల చేయగా, వాటిలో ఏపీకి రూ.1559.07 కోట్లు, తెలంగాణకు రూ.1077.30 కోట్లు దక్కాయి. కాగా, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అక్టోబర్ 23 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది.
Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్పై విచారణ.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు