
Ashwini Vaishnaw: టెలికం రంగం అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు వేసింది. 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్ ప్రొడక్షన్ లైన్ను భారత్ ప్రారంభించింది. మంగళవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కనెక్టివిటీ మాడ్యూల్ ప్రొడక్షన్ లైన్ను ప్రారంభించారు. గురుగ్రామ్లోని మానేసర్లో వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి దీనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లడుతూ.. 4జీ, 5జీ కనెక్టివిటీ మాడ్యూల్ ప్రొడక్షన్ లైన్ను ప్రారంభించడం గర్వించదగ్గ అంశమని తెలిపారు. ఈ చర్య దేశంలోని టెలికం రంగాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో టెలికం రంగాన్ని పెంపొందించడంలో భారత ప్రభుత్వ చేస్తున్న కృషికి ఇది నిదర్శమన్నారు. భారత్ ప్రస్తుతం 5జీ నెట్ వర్క్లో ప్రపంచంలోనే టాప్ 3 నెట్వర్క్స్లో ఒకటిగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
టెలికాం రంగంలో దాదాపు రూ. 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని మంత్రి తెలిపారు. ఇక అమ్మకాల ద్వారా రూ. 3400 కోట్ల ఆర్జించినట్లు మంత్రి వివరించారు. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో ఏకంగా రూ. 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అంచనా వేశారు. ఇక టెలికాం రంగంలో వచ్చే రోజుల్లో 17 వేల మందికిపైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశానికి చెందిన అనే టెలికాం సంస్థలు సిక్స్ సిగ్మా సర్టిఫికేషన్ పొందాయని మంత్రి తెలిపారు. టెలికాం రంగం సంస్థలకు ఈ సర్టిఫికేషన్ను ఒక గౌరవంగా భావిస్తారు. ఇక రానున్న రోజుల్లో భారత్ గ్లోబల్ డిజైన్, ఇన్నోవేషన్, మాన్యుఫ్యాక్చరింగ్కు కేంద్ర బిందువు కానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. 6జీ స్టాండర్డైజేషన్ వల్ల టెలికం రంగంలో భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..