AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 మంది రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు

తమిళనాడులో 32 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రీన్‌ వేకు వ్యతిరేకంగా వీరందరూ ఆందోళన చేపట్టగా.. తాజాగా వారిపై కేసు నమోదైంది.

32 మంది రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 9:14 AM

Share

తమిళనాడులో 32 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రీన్‌ వేకు వ్యతిరేకంగా వీరందరూ ఆందోళన చేపట్టగా.. తాజాగా వారిపై కేసు నమోదైంది. అయితే సేలం–చెన్నై మధ్య గ్రీన్ ‌వే పథకాన్ని రద్దు చేయాలన్న కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కేసును త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకు ఇటీవల అప్పీల్‌ చేసింది. ఈ క్రమంలో గ్రీన్ వేకు వ్యతిరేకంగా సేలం జిల్లా లాలికాల్‌ పట్టిలో ఆందోళన చేసిన 21 మంది రైతులపై మల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కుల్లంపట్టిలో మరో 11 మంది రైతులపై కారిపట్టి పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ సోమవారం సేలం జిల్లా అయోద్యపట్నంలో 7వ మైల్, రామలింగపురంలో రైతులు నల్ల జెండాలతో తమ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

Read This Story Also: క్వారంటైన్‌ సెంటర్‌లో కుక్కను ఉంచిన అధికారులు.. ఎందుకంటే..!