AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Down: దేశంలోకి ప్రవేశించిన పాక్ డ్రోన్లు.. ఇవాళ అమృత్‌సర్‌ దగ్గర పాక్‌ డ్రోన్‌ను పేల్చివేసిన BSF దళాలు

సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్‌..డ్రోన్స్‌ కలకలం.. వారం రోజుల్లో మూడు సార్లు పాకిస్తాన్ డ్రోన్స్‌..సెక్యూరిటీ సిబ్బందికి చెమటలు పట్టించాయి. ఇవాళ పంజాబ్‌ సరిహద్దులో ఓ డ్రోన్‌ ఉలిక్కిపడేలా చేసింది.

Down: దేశంలోకి ప్రవేశించిన పాక్ డ్రోన్లు.. ఇవాళ అమృత్‌సర్‌ దగ్గర పాక్‌ డ్రోన్‌ను పేల్చివేసిన BSF దళాలు
Drone
Sanjay Kasula
|

Updated on: Nov 29, 2022 | 12:22 PM

Share

భారత భూభాగంలోకి పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ల చొరబాటు కొనసాగుతోంది. ఇప్పుడు అమృత్‌సర్‌లో డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయి. సోమవారం రాత్రి అమృత్‌సర్‌లో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానిత డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కూల్చివేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బీఎస్ఎఫ్ ప్రకటన కూడా విడుదల చేసింది. సోమవారం రాత్రి, అమృత్‌సర్ (గ్రామీణ)లోని చహర్‌పూర్ సమీపంలో పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన అనుమానాస్పద డ్రోన్‌ను సరిహద్దులో ఉంచిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కాల్చివేసినట్లు  తెలిపింది. ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి పోలీసులకు సంబంధిత సంస్థలకు సమాచారం అందించారు. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న డ్రోన్‌తో పాటు..అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ నెల 24న జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ కలకలం రేపింది. సాంబ జిల్లాలోని విజయ్‌పూర్‌ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్‌.. ఓ ప్యాకెట్‌ని వదిలి వెళ్ళడంతో భారత భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అందులో అత్యాధునిక ఆయుధాలున్నాయి. అవి పాకిస్తాన్‌కి చెందినవిగా గుర్తించారు. అలాగే ఐదు లక్షల కరెన్సీ కూడా గుర్తించారు.

అంతకుముందు నవంబర్ 26 అర్థరాత్రి, పాకిస్తాన్ వైపు నుంచి పంజాబ్‌లోని తార్న్ తరన్ అమర్‌కోట్ గ్రామంలోకి డ్రోన్ ప్రవేశించడం కనిపించింది. డ్రోన్ కనిపించిన వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత డ్రోన్ తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లింది. సమాచారం ప్రకారం, నవంబర్ 26 న, BSF 103 బెటాలియన్ సైనికులు పెట్రోలింగ్‌లో ఉండగా వారు డ్రోన్ శబ్దాన్ని విన్నారు. శబ్దం విన్న జవాన్లు కాల్పులు ప్రారంభించారు. ఈ సమయంలో సైనికులు దాదాపు 22 రౌండ్లు కాల్పులు జరిపారు. ఫలితంగా కొంత సమయం తర్వాత డ్రోన్ వెనక్కి వెళ్లిన శబ్దం వినిపించింది.

పాకిస్థాన్ డ్రోన్ గతంలో కూడా..

అంతకుముందు నవంబర్ 15న భారత్-పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ కనిపించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని బమియాల్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది సరిహద్దు సమీపంలో డ్రోన్ సంచరించడం చూశారు. BSF జవాన్ల కాల్పుల తర్వాత, అతను పాకిస్తాన్ వైపు తిరిగి పరుగెత్తవలసి వచ్చింది.

మోదీ సభలో డ్రోన్‌..

ఇక అదేరోజు ఈ ఘటన నుంచి తేరుకునేలోపే గుజరాత్‌లో మోదీ సభలో ఒక్కసారిగా డ్రోన్‌ కనిపించడంతో సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే వారు ఓ వీడియో షూట్‌ కోసం డ్రోన్‌ని ఉపయోగించినట్టు గుర్తించారు.