AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ఈడీ విచారణకు హాజరవుతా.. సస్పెన్స్‌కు తెర తీసిన ఎమ్మెల్సీ కవిత.

ఈడీ విచారణకు కవిత హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరుపై రాత్రి నుంచి న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం విచారణకు వెళ్లాలని నిర్ణయం..

MLC Kavitha: ఈడీ విచారణకు హాజరవుతా.. సస్పెన్స్‌కు తెర తీసిన ఎమ్మెల్సీ కవిత.
MLC Kavitha,
Sanjay Kasula
| Edited By: |

Updated on: Mar 20, 2023 | 9:32 AM

Share

ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్‌కు తెరదించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణకు కవిత హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరుపై రాత్రి నుంచి న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం విచారణకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఉదయం 11 గం.లకు ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు. కవితతో పాటే నివాసంలో మంత్రి కేటీఆర్‌, సంతోష్‌ సహా ఇతర నేతలు ఉన్నారు. ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీస్‌ ఎదుట భారీగా పోలీసుల మోహరించారు.

వాదనలు వినకుండా, ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈడీ కేవియట్ పిటీషన్‌ వేశారు. ఇవాళ్టితో ముగియనున్న రామచంద్రపిళ్లై కస్టడీ. కవిత ఈడీ విచారణకు హాజరైతే పిళ్లైతో కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను వెళ్లకుండా మళ్లీ న్యాయవాదులనే పంపే చాన్స్‌ కూడా ఉందంటున్నారు.

ఇదిలావుంటే, బేగంపేట నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. వెంట మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ, కోర్టు వాయిదాలు.. నిందితుల కస్డడీ ఇలా చాలా పరిణామాలు కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు.

అయితే ఢిల్లీ వెళ్లిన కవిత విచారణకు మాత్రం హాజరుకాలేదు. తన ప్రతినిధిగా సోమ భరత్ కుమార్‌ను ఈడీ కోరిన బ్యాంకు స్టేట్‌మెట్లు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించారు. విచారణకు హాజరుకానప్పటికీ దాన్ని గైర్హజరుగా పరిగణించలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. 20న విచారణకు రావాలని సూచించింది.

ఈడీ జారీ చేసిన నోటీసుల్లో ఈసారి వ్యక్తిగతంగా అన్న పదాన్ని ప్రస్తావించారని.. ఈ పరిస్థితుల్లో కవిత ఇవాళ విచారణను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. విచారణలో భాగంగా కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో పాటుగా ప్రశ్నించాలని భావిస్తోంది. అయితే కవిత విచారణపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..