బీహార్ లో బీజేపీ ప్రచారం ప్రారంభం, మోదీ, నితీష్ ‘జపం’ !

ప్రధాని మోదీ చేతుల్లో దేశం, నితీష్ కుమార్ చేతిలో బీహార్ రాష్ట్రం సురక్షితంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రకటించారు. ‘మోదీ,  నితీష్ మేకిట్ పాజిబుల్’ అని ఆయన నినదించారు.బీహార్ ఎన్నికల నేపథ్యంలో… రాష్ట్రంలోని గయలో ఆదివారం ఆయ..బీజేపీ-జేడీ-యూ కూటమి తరఫున ప్రచారం ప్రారంభించారు. నితీష్ కుమార్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి, రాష్ట్ర  సర్వతోముఖాభివృద్దిలో పాలు పంచుకోండి అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ 15 ఏళ్లలో, ముఖ్యంగా 2014 లో కేంద్రంలో మోదీ ఆధ్వర్యాన […]

బీహార్ లో బీజేపీ ప్రచారం ప్రారంభం, మోదీ, నితీష్ 'జపం' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2020 | 6:48 PM

ప్రధాని మోదీ చేతుల్లో దేశం, నితీష్ కుమార్ చేతిలో బీహార్ రాష్ట్రం సురక్షితంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా ప్రకటించారు. ‘మోదీ,  నితీష్ మేకిట్ పాజిబుల్’ అని ఆయన నినదించారు.బీహార్ ఎన్నికల నేపథ్యంలో… రాష్ట్రంలోని గయలో ఆదివారం ఆయ..బీజేపీ-జేడీ-యూ కూటమి తరఫున ప్రచారం ప్రారంభించారు. నితీష్ కుమార్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి, రాష్ట్ర  సర్వతోముఖాభివృద్దిలో పాలు పంచుకోండి అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ 15 ఏళ్లలో, ముఖ్యంగా 2014 లో కేంద్రంలో మోదీ ఆధ్వర్యాన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వఛ్చినప్పటి నుంచి బీహార్ లో వికాస్ (అభివృధ్ది) చాలా జరిగింది అని నడ్డా చెప్పారు. ఇక్కడ కరోనా వైరస్ ని అదుపు చేయడంలో నితీష్ కుమార్ ఎంతో సమర్థంగా వ్యవహరించారని ఆయన ప్రశంసించారు.  చిరాగ్ పాశ్వాన్ పార్టీ గురించి ఆయన పెద్దగా ప్రస్తావించలేదు.