AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో పిల్లర్ పడి తల్లి, బిడ్డ మృతి.. రూ.10 కోట్ల పరిహారం కోరుతూ డిమాండ్.. ప్రభుత్వానికి హైకోర్టు అత్యవసర నోటీసు

తేజస్విని కుటుంబం ఇటీవల అప్పు చేసి ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని, బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి మృతురాలి భర్త వేసిన పిటిషన్‌పై హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి, బీఎంఆర్‌సీఎల్‌కు అత్యవసర నోటీసులు జారీ చేసింది.

మెట్రో పిల్లర్ పడి తల్లి, బిడ్డ మృతి.. రూ.10 కోట్ల పరిహారం కోరుతూ డిమాండ్.. ప్రభుత్వానికి హైకోర్టు అత్యవసర నోటీసు
Bengaluru Metro Pillar Case
Jyothi Gadda
|

Updated on: Jul 26, 2023 | 2:59 PM

Share

నిర్మాణంలో ఉన్న మెట్రోపిల్లర్ పడి భార్య,బిడ్డను కోల్పోయిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో పిల్లర్ కూలిన సంఘటనపై బాధితుడికి పరిహారం కోరింది. బిఎమ్‌ఆర్‌సిఎల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పిటిషనర్ లోహిత్‌కుమార్ వి సులాఖే రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

జనవరి 10, 2023 న నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ పడిపోవడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న పిటిషనర్ భార్య తేజస్విని ఎల్ సులాఖే (26), అతని రెండున్నరేళ్ల కుమారుడు విహాన్ మరణించారు. ఘటనకు సంబంధించి మృతురాలి భర్త వేసిన పిటిషన్‌పై హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి, బీఎంఆర్‌సీఎల్‌కు అత్యవసర నోటీసులు జారీ చేసింది.

కొంత కాలంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.ఎఫ్. హుస్సేన్‌ వాదనలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీఎంఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, బెంగళూరు జిల్లా కలెక్టర్‌, మెట్రో వర్క్స్‌ కాంట్రాక్టర్‌ కంపెనీ బెంచ్‌ విన్నారు. తేజస్విని కుటుంబం ఇటీవల అప్పు చేసి ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని, బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తమ అభ్యంతరాలను దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తర్వాత, ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం అత్యవసర నోటీసు జారీ చేసింది. నాగార్జున కన్‌స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ సహా పిటిషన్‌లోని ఎనిమిది మంది ప్రతివాదులకు అత్యవసర నోటీసులు జారీ చేసింది విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..