ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజం.!

దొంగలను పట్టుకోవాల్సిన కొందరు ఖాకీలు.. దొంగపనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సొసైటీని క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిందిపోయి.. అత్యాశకు ఆశపడి.. చివరికి ఊసలు లేక్కపెడుతున్నారు. ఈ కోవలోనే ఓ చోరీ కేసులో రికవరీ చేసిన కిలోన్నర బంగారంలో నుంచి 582 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు..

ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజం.!
Representative Image

Updated on: May 18, 2024 | 8:59 AM

దొంగలను పట్టుకోవాల్సిన కొందరు ఖాకీలు.. దొంగపనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సొసైటీని క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిందిపోయి.. అత్యాశకు ఆశపడి.. చివరికి ఊసలు లేక్కపెడుతున్నారు. ఈ కోవలోనే ఓ చోరీ కేసులో రికవరీ చేసిన కిలోన్నర బంగారంలో నుంచి 582 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. కోలార్ జిల్లా బంగారుపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన అనిల్ అనే పోలీసు కానిస్టేబుల్ ఈ పనికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 25న బంగారుపేట బస్ స్టేషన్‌లో బంగారం వ్యాపారి గౌతమ్ చంద్‌కు చెందిన 2 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇక 1 కేజీ 408 గ్రాములు గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు ఖాకీలు.

బంగారం స్వాధీనం చేసుకున్న కొద్దిరోజుల అనంతరం ఆ గోల్డ్ నుంచి 582 గ్రాముల గోల్డ్ మాయమైంది. దీనిపై అనుమానపడ్డ పోలీసులు.. అసలు అంశంపై కూపీ లాగారు. గోల్డ్ మాయం అయిన రోజు నుంచి స్టేషన్‌లో పని చేస్తున్న క్రైమ్ కానిస్టేబుల్ అనిల్ 15 రోజులుగా కనిపించకుండాపోయాడని గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న అతడ్ని వెతికి పట్టుకోగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్‌తో సహా మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని ఎస్పీ శాంతరాజు కేజీఎఫ్ డీవైఎస్పీని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. 

Loading...
Unable to load recommendations.
Follow Us