AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: గుంత వల్లే ఘోరం జరిగింది.. ఉత్తరాఖండ్ సీఎం ధామితో రిషబ్ పంత్.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్‌ ఇండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఆస్పత్రిలో పరామర్శించారు.

Rishabh Pant: గుంత వల్లే ఘోరం జరిగింది.. ఉత్తరాఖండ్ సీఎం ధామితో రిషబ్ పంత్.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
Rishabh Pant, Cm Dhami
Shaik Madar Saheb
|

Updated on: Jan 01, 2023 | 4:06 PM

Share

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్‌ ఇండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఆస్పత్రిలో పరామర్శించారు. డెహ్రాడూన్‌ లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి చేరుకున్న సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి.. రిషబ్‌ పంత్‌ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిషబ్ పంత్ ను పరామర్శించి.. సీఎం ధామి మాట్లాడారు. శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన భారత బ్యాటర్ మ్యాక్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రోడ్డుపై ఉన్న గుంత వల్లే ప్రమాదం జరిగిందని పంత్ తనకు తెలియజేసినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. పంత్‌తో భేటీ అనంతరం ఉత్తరాఖండ్ సీఎం మీడియాతో ముచ్చటించారు. పంత్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. ప్రమాదంలో తగిలిన గాయాల కారణంగా రిషబ్ పంత్ శరీరంలో నొప్పిని అనుభవిస్తున్నాన్నారు. డాక్టర్ల ప్రకారం, వచ్చే 24 గంటల్లో నొప్పి తగ్గుతుందని తెలిపారు.

పంత్ ప్రమాదానికి గురైన తర్వాత చాలా మంది తనకు సహాయం చేశారని చెప్పారని సీఎం ధామి పేర్కొన్నారు. అతనికి వైద్య చికిత్స ఇక్కడ కొనసాగుతుందని.. మాక్స్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం ధామి వివరించారు. క్రికెటర్ కారు ప్రమాదానికి గురైన తర్వాత ఉత్తరాఖండ్ సీఎం ధామి.. పంత్ కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పంత్ ఆరోగ్యంపై సీఎంకు సమాచారం అందించే బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు, ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాక్స్ హాస్పిటల్‌లో పంత్‌ను కలవడానికి వెళ్లారు. ఈ భయంకరమైన ప్రమాదానికి కారణమైన గుంత గురించి భారత క్రికెటర్ అతనికి తెలియజేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కాగా, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రిషబ్‌ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పంత్‌కు అనేక రకాల వైద్యపరీక్షలు చేశారు. మెదడు, వెన్నెముక, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టులు సాధారణంగా వచ్చాయని, ఎలాంటి సమస్య లేదని వైద్యులు అనంతరం వెల్లడించారు. ముఖం, శరీరంపై ఇతర గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. వాపు, నొప్పి ఉండడంతో చీలమండ, మోకీలుకు శనివారం స్కానింగ్ చేశారు.

ప్రస్తుతం పంత్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. బీసీసీఐ ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తోంది. పంత్ కుటుంబ సభ్యులతో వైద్యులతో ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకుంటోంది. రిషబ్‌ పంత్‌ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి లేదా విదేశాలకు పంపించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
కోచ్‌గా గంభీర్ సంచలన నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
కోచ్‌గా గంభీర్ సంచలన నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..