AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millionaires: భారత్ నుంచి వెళ్లిపోతున్న సంపన్నులు.. ఈ ఏడాది ఎంతమంది వెళ్తున్నారంటే

హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ ప్రకారం.. 10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారిని మిలియనీర్లు లేదా అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా పరిగణిస్తారు. అయితే ధనవంతులను కోల్పోతున్న దేశాల జాబితాలో ఈ ఏడాది చైనా మొదటి స్థానంలో నిలిచింది.

Millionaires: భారత్ నుంచి వెళ్లిపోతున్న సంపన్నులు.. ఈ ఏడాది ఎంతమంది వెళ్తున్నారంటే
Foriegn Country
Aravind B
|

Updated on: Jun 14, 2023 | 6:23 PM

Share

భారత్‌ నుంచి ప్రతి ఏడాది సంపన్నలు విదేశాలకు వలస వెళ్తున్నారు . 2023లోనే సుమారు 6500 మంది అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే ‘హెన్లీ ప్రైవేట్‌ మైగ్రేషన్‌ నివేదిక-2023’ ఈ వివరాలను తెలియజేసింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ ప్రకారం.. 10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారిని మిలియనీర్లు లేదా అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా పరిగణిస్తారు. అయితే ధనవంతులను కోల్పోతున్న దేశాల జాబితాలో ఈ ఏడాది చైనా మొదటి స్థానంలో నిలిచింది. 2023లో చైనా నుంచి దాదాపు 13,500 మంది సంపన్నులు వలస వెళ్తారని అంచనా వేస్తున్నారు.

అయితే ఆ తర్వాత స్థానంలో భారత్‌ ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య తక్కువే ఉంది. గతేడాదిలో భారత్‌ నుంచి 7500 సంపన్నులు వలస వెళ్లారని అంచనా. ఈ ఏడాది వెళ్లేవారిలో చాలామంది దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు వలస వెళ్తున్నట్లు తేలిసింది. ఇక యూకే నుంచి 3200 మంది, రష్యా నుంచి 3వేల మంది వలస వెళ్లిపోనున్నారాని అంచనా. మరో విషయం ఏంటంటే భారత్‌ నుంచి భారీ సంఖ్యలో వెళ్లిపోతున్నప్పటికీ అంతకుమించిన సంఖ్యలో మిలియనీర్లు తయారవుతున్నారని న్యూ వరల్డ్‌ వెల్త్‌కు చెందిన పరిశోధకుడు ఆండ్రూ ఆమోయిల్స్‌ తెలిపారు. అందుకే ఇలా భారత్ నుంచి వలసలు ఉంటున్నప్పటికీ ప్రమాదం లేదని చెప్పారు. విదేశీ పన్ను చెల్లింపులకు సంబంధించి భారత్‌లో కఠిన నిబంధనలు ఉండటం వంటి సమస్యలు విదేశాల్లో పెట్టుబడుల ఆసక్తికి కారణమవుతున్నాయని మార్కెట్‌ నిపుణురాలు సునితా సింగ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు