ఎంత దారుణం..! కదులుతున్న రైళ్లలోనే మహిళపై అత్యాచారం..!! మీ తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరించి..

|

Nov 12, 2023 | 2:14 PM

ఆ తర్వాత నిందితులు ఆమెను బెదిరించి అజ్మీర్, జైపూర్‌లకు కూడా తీసుకెళ్లారని చెప్పింది.. అక్కడ కూడా హోటల్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితులు ఆమెను పగటిపూట హోటల్ గదిలో బంధించి రాత్రి వేళల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు తనను బెదిరించి పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంలో మరో ముగ్గురు నిందితులు కూడా తనకు సహకరించారని బాధితురాలు ఆరోపించింది.

ఎంత దారుణం..! కదులుతున్న రైళ్లలోనే మహిళపై అత్యాచారం..!! మీ తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరించి..
woman raped in moving train in churu
Follow us on

రాజస్థాన్ లోని చురు నగరంలోని కొత్వాలి ప్రాంతంలో హృదయ విదారకమైన అత్యాచార ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌లో ప్రధాన నిందితుడు సహా ఐదుగురిపై కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే వారి జాడ మాత్రం ఇంకా దొరకలేదని సమాచారం. నిందితుడు తనను బందీగా పెట్టుకున్నాడని కూడా బాధితురాలు ఆరోపించింది. మహిళా పోలీస్‌ స్టేషన్‌ పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, 28 ఏళ్ల వివాహిత తనకు 2014 సంవత్సరంలో జుంజును జిల్లాలోని ఒక గ్రామంలో వివాహం జరిగిందని నివేదించింది. వివాహం తర్వాత, ఆమె చురులోని కొత్వాలి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తుంది. ఇతని ఇంటికి సమీపంలోనే జ్యువెలరీ షోరూం ఉంది. అందులో నరేంద్ర అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. తనతో మొబైల్‌లో మాట్లాడాలని నరేంద్ర తరచూ ఒత్తిడి చేసేవాడని ఆరోపించింది.

చురు నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో ఆమెను కూర్చోబెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 3న స్వగ్రామానికి వెళ్తుండగా నరేంద్ర ఆమెకు ఫోన్ చేసి తన సోదరుడు నరేంద్ర వద్ద బంధీగా ఉన్నాడని చెప్పాడు. నగలు తీసుకుని ఇంటి నుంచి బయటకు రాకపోతే తన తమ్ముడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పింది.. నగలతో బయటకు వెళ్లగానే నరేంద్ర ఆమెను కత్తితో బెదిరించి బైక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి చూరు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తనను రైలులో ఢిల్లీకి తరలించాడు. రైలు చురు నుండి బయలుదేరిన వెంటనే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఆమె టాయిలెట్‌కు తీసుకెళ్లిన నరేంద్ర కదులుతున్న రైలులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత నిందితులు ఆమెను బెదిరించి అజ్మీర్, జైపూర్‌లకు కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా హోటల్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితులు ఆమెను పగటిపూట హోటల్ గదిలో బంధించి రాత్రి వేళల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు తనను బెదిరించి పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంలో మరో ముగ్గురు నిందితులు కూడా తనకు సహకరించారని బాధితురాలు ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

నవంబర్ 9 వరకు నిందితుడు నరేంద్ర చురులో తనపై అత్యాచార దాడులకు పాల్పడ్డాడని చెప్పింది. ఎట్టకేలకు నిందితుల బారి నుంచి తను ఎలాగోలా తప్పించుకున్నానని చెప్పింది. తన తమ్ముడిని చంపేస్తానని బెదిరించి తనపై ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్‌ చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..