తమిళనాడు కల్తీ సారా వ్యవహారంలో 26కు చేరిన మృతుల సంఖ్య! మరో 30 మందికి సీరియస్‌

కల్తీ సార వ్వవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతుంది. తాజాగా కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి. కల్తీ సారా సేవించిన వారు..

తమిళనాడు కల్తీ సారా వ్యవహారంలో 26కు చేరిన మృతుల సంఖ్య! మరో 30 మందికి సీరియస్‌
Illicit Liquor Case In Tamil Nadu's Kallakurichi
Follow us

|

Updated on: Jun 20, 2024 | 7:05 AM

చెన్నై, జూన్‌ 20: కల్తీ సార వ్వవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతుంది. తాజాగా కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి. కల్తీ సారా సేవించిన వారు వరుసగా మృతి చెందుతుండటంతో.. అప్పటికే సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రి బాధితులతో నిండిపోయింది. వీరిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు.

కాళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్‌ ఎంఎస్‌ ప్రశాంత్‌ పరామర్శించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కల్తీసార మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ‘కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను . నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని’ సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్‌ మీనాపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అలాగే కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను కూడా బదిలీ చేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చికి పంపించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అవును నయన్ తో గొడవలు నిజమే.. నిజం చెప్పిన త్రిష.
అవును నయన్ తో గొడవలు నిజమే.. నిజం చెప్పిన త్రిష.
ప్రతి వ్యాధికి మందులా దానిమ్మ..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే..
ప్రతి వ్యాధికి మందులా దానిమ్మ..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే..
చాణుక్యుడు చెప్పిన ఈ 10 విషయాలతో .. ష్టాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు..
చాణుక్యుడు చెప్పిన ఈ 10 విషయాలతో .. ష్టాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు..
ట్రోఫీలు అందించిన మూడు క్యాచ్‌లు గుర్తున్నారా?
ట్రోఫీలు అందించిన మూడు క్యాచ్‌లు గుర్తున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే.
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే.
తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. ఫ్యూజులు ఔట్
ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. ఫ్యూజులు ఔట్
17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి
17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే