సీఎం జగన్‌పై లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ప్రాజెక్ట్ విషయాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం విదితమే. ఈ సభలో అసెంబ్లీలో నుంచి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌‌ వేటు పడింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నోటుకి ….నీళ్లు!.. హిట్లర్ కాస్తా ఒక్కసారిగా భగీరథునిగా మారిపోయాడు. ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా […]

సీఎం జగన్‌పై లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 11:42 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ప్రాజెక్ట్ విషయాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం విదితమే. ఈ సభలో అసెంబ్లీలో నుంచి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌‌ వేటు పడింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘నోటుకి ….నీళ్లు!.. హిట్లర్ కాస్తా ఒక్కసారిగా భగీరథునిగా మారిపోయాడు. ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా నీళ్లు దోచేసిన కేసీఆర్ కాస్తా @ysjagan గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రాకి నీళ్లు దానం చేసే మనసున్న మారాజుగా మారారు’ అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

‘యూ టర్న్ జగన్ గారూ! ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కట్టల సాయం అందుకున్నాం… అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండి’ అని నారా లోకేష్ ట్విట్టర్ వేదిగా రాసుకొచ్చారు. కాగా ఈ ట్వీట్‌పై టీడీపీ, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.