ఆంధ్రా సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. పోలీసులపై దౌర్జన్యం

ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి 39 మంది బంధువులతో ఐదు ఇన్నోవాలలో ఆంధ్రా బార్డర్‌కి వచ్చారు ఎమ్మెల్యే. చీకలబైలు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే కార్లను...

ఆంధ్రా సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. పోలీసులపై దౌర్జన్యం
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 5:24 PM

ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి 39 మంది బంధువులతో ఐదు ఇన్నోవాలలో ఆంధ్రా బార్డర్‌కి వచ్చారు ఎమ్మెల్యే. చీకలబైలు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే కార్లను అడ్డుకున్నారు పోలీసులు. లాక్‌డౌన్ ఉన్న కారణంగా కర్ణాటక నుంచి వచ్చే వారిని అనుమతించేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో.. పోలీసులతో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా పోలీసులపై దౌర్జన్యం చేసి తన వాహనంలో తిరుపతి వెళ్లారు ఎమ్మెల్యే. కాగా ఇప్పటికీ చెక్‌పోస్ట్ వద్దే ఉన్నాయి ఎమ్మెల్యే బంధువుల వాహనాలు.

Learn More:

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసు కేసు

లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్

బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్‌ సంచలన నిర్ణయం

కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే