Jagannath Temple: జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. పూరీలోని ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి.. మధుర జ్ఞాపకంగా మిలిగిలిపోతుంది..

హిందువులు మాత్రమే కాదు కృష్ణ భక్తులు సందర్శించాలనుకునే క్షేత్రం పూరీ. ఈ క్షేత్రంలో కొలువైన జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. ఆలయాన్ని సందర్శించిన తర్వాత.. ఇక్కడ అనేక ప్రదేశాలను అన్వేషించవచ్చు. ఇక్కడ అనేక కొత్త విషయాలను తెలుసుకోవడమే కాదు.. అందమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.

Jagannath Temple: జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. పూరీలోని ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి.. మధుర జ్ఞాపకంగా మిలిగిలిపోతుంది..
Puri Jagannath Temple

Updated on: Jun 17, 2025 | 9:31 AM

ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు అంకితం చేయబడింది. భక్తులు ఇక్కడికి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ రథయాత్ర గొప్ప వైభవంగా, ప్రదర్శనతో నిర్వహించబడుతుంది. ఈసారి రథయాత్ర జూన్ 27, 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇక్కడ చాలా మంది జనసమూహం కనిపిస్తుంది. మీరు కూడా జగన్నాథ యాత్ర కోసం పూరికి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తుంటే.. ఆలయానికి సమీపంలో ఉన్న ఈ అందమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.

ఇక్కడ మీరు మీ ప్రియమైన వారితో కలిసి అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. కనుక రథయాత్ర సమయంలో లేదా ఎప్పుడైనా పూరీని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.

పూరి బీచ్
పూరీ భక్తులు, పర్యాటకులు పవిత్ర స్నానాల కోసం ఇక్కడకు వస్తారు. జగన్నాథ ఆలయం నుంచి పూరీ బీచ్ దూరం దాదాపు 1 నుండి 2 కిలోమీటర్లు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఇక్కడి దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కనుక పూరీ బీచ్‌ను “గోల్డెన్ బీచ్” అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం హిందూ విశ్వాసాలకు కేంద్రంగా మాత్రమే కాదు పర్యాటకులకు అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటిగా కూడా ఉంది. అయితే రథయాత్ర సమయంలో.., ఇక్కడ భక్తుల భారీ రద్దీ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

చిలికా సరస్సు
చిలికా సరస్సు చాలా మనోహరమైన ప్రదేశం. ఈ ప్రదేశం జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 40 నుంచి 50 కి.మీ దూరంలో ఉంది. టాక్సీ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఇది భారతదేశంలోని అతిపెద్ద తీరప్రాంత సరస్సులలో ఒకటి. శీతాకాలంలో వేలాది వలస పక్షులు ఈ సరస్సు చుట్టూ వస్తాయి. ఈ సమయంలో సైబీరియన్ పక్షులు కూడా ఇక్కడికి వస్తాయి. మీరు ఇక్కడ బోటింగ్ చేసే అవకాశాన్ని పొందవచ్చు. నలబానా పక్షుల అభయారణ్యం చిలికా సరస్సు సమీపంలో ఉంది.

కోణార్క్ సూర్య దేవాలయం
కోణార్క్ సూర్య దేవాలయం పూరీలో ఉంది. ఈ జగన్నాథ ఆలయం దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యనారాయణ దర్శనం కోసం ఇక్కడకు కూడా వెళ్ళవచ్చు. ఇది దాని శిల్పా కళా సంపదకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సూర్య భగవానుడి రథం రూపంలో నిర్మించబడింది. దీనికి దాదాపు 24 చక్రాలు, 7 గుర్రాలు ఉన్నాయి. ఆలయ గోడలపై చక్రాలు, గుర్రాల చెక్కడాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

సుదర్శన్ క్రాఫ్ట్ మ్యూజియం
ఇది పూరి జంక్షన్ నుంచి దాదాపు 2 కి.మీ దూరంలో ఉంది. ఇది శని, ఆదివారాల్లో మూసివేయబడి ఉంటుంది. ఇతర రోజులలో ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం 2:00 నుంచి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది. కళపై ఆసక్తి ఉన్నవారికి సందర్శించేందుకు ఇది సరైన ప్రదేశం. మ్యూజియంలో ఉన్న చెక్క కళాఖండాలు, శిల్పాలు, చెక్కిన రాళ్ళు, పెయింటింగ్‌లు, హస్తకళా వస్తువులు చాలా అందంగా కనిపిస్తాయి. ఇది చూడదగినది. ఇక్కడ ప్రవేశ రుసుము భారతీయులకు రూ. 5 , విదేశీయులకు రూ. 50.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..